AP : నిమ్మచెట్ల నరికివేతపై చంద్రబాబు వార్నింగ్..!
అన్నమయ్య జిల్లా పోలిగ్రామంలో నిమ్మచెట్ల నరికివేత ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అన్నమయ్య జిల్లా పోలిగ్రామంలో నిమ్మచెట్ల నరికివేత ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఐదు ఏకరాల్లోని 450 నిమ్మ చెట్లను దుండగులు నరికేశారు. భూ వివాదమే కారణమని తెలుస్తోంది. చంద్రారెడ్డి అనే వ్యక్తి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భూమి తనదే అంటున్నాడని బాధితురాలు మంజుల వాపోయింది. చెట్ల నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ ఇసుక దందాకు యువకుడు బలి అయ్యాడు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎస్ఈబి, టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వారి నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో ట్రాక్టర్ బోల్తా పడి ప్రతాప్ అనే యువకుడు మృతి చెందాడు.
కడప జిల్లా పులివెందులలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. న్యాక్ బిల్డింగ్ సమీపంలో నివాసం ఉంటున్న వైసీపీ కార్యకర్త అబ్దుల్ ఇంట్లోకి చొరబడి టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. అడ్డొచ్చిన అబ్దుల్ మేనమామను సైతం తలపై కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గా రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీచేయనున్నారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే, ఆయనపై వైఎస్ షర్మిల పోటీకి దిగుతారని అంటున్నారు. ఈ ఊహాగానాల వెనుక కథేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
కడపలో ఉప ఎన్నిక వస్తుందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయం మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గల్లీ గల్లీ తిరుగుతూ కడప పౌరుషాన్ని ఢిల్లీని తాకేలా చేస్తానన్నారు.
ఏపీ రోడ్లు నెత్తురొడుతున్నాయి. శనివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు.అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల బసవరాజు కండ్రిగ వద్ద టూరిస్టు బస్సు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
AP: మాజీ సీఎం జగన్ ఇలాకాలో హై టెన్షన్ నెలకొంది. పులివెందులలోని తువ్వపల్లెకు చెందిన వైసీపీ కార్యకర్త అజయ్కుమార్ రెడ్డిపై దాడి జరిగింది. బీటెక్ రవి మనుషులం అంటూ క్రికెట్ బ్యాట్లు, కర్రలతో అతడిని చావబాదారు.
అవినీతికి పాల్పడనంటూ ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ తో వెంకటేశ్వర స్వామి పటంపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రమాణం చేయించారు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందిని అవినీతికి పాల్పడవద్దని హెచ్చరించారు.