Breaking : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.బాపట్ల జిల్లా చిన గంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ను అతి వేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.బాపట్ల జిల్లా చిన గంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ను అతి వేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున వైఎస్ షర్మిల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఏపీ ప్రజలనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు,నేతలు,ఈ మహాయజ్ఞంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ఓటరు మహాశయులకు, పోలీసువారికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఙతలు తెలిపారు.
విశాఖ జిల్లాలోని కొందరు ఓటర్లకు అధికారులు షాక్ ఇచ్చారు. పోలింగ్ టైమ్ అయిపోయిందని కొందరు ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పెనమలూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ తన అనుచరులతో కలిసి రెచ్చిపోయారు. ఉప్పులూరు లోని పోలింగ్ కేంద్రానికి తన అనుచరులతో కలిసి వచ్చిన రాజీవ్, టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. తెలంగాణ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సమయం ముగిసింది. తెలంగాణలోని 5 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది.
విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కొత్త శ్రీరంగరాజపురంలో ని పోలింగ్ కేంద్రంలో పీవోగా చేస్తున్న రాంబాబు అనే వ్యక్తి ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలతో పాటు.. ఓట్లు వేసే సమయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు..అతడిపై దాడికి దిగి చితకబాదారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును కొడంగల్లో వినియోగించుకున్నారు. దాని తర్వాత ఆయన మాట్లాడుతూ దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని చెప్పారు. బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తూ 400 సీట్లు వస్తాయని ఎలా చెబుతారని ప్రశ్నించారు.
తెలుగురాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో ఇద్దరు వ్యక్తు చనిపోయారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న శ్రీకృష్ణ అనే ఆఫీసర్ గుండెపోటు కారణంగా మృతి చెందారు. మరోవైపు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఓటు వేయడానికి వచ్చిన వృద్ధ మహిళకు కూడా చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఉదయం ఏడు గంటలకే పోలింగ్ మొదలైంది. అయితే చాలా చోట్ల ఈవీఎంలు సరిగ్గా పని చేయక మొరాయిస్తున్నాయి. దీంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా మొదలవ్వడం, కొన్ని చోట్ల మధ్యలో ఆగిపోవడం లాంటివి జరుగుతున్నాయి.