IND VS AUS: స్వింగ్ మాములుగా లేదు బాసూ.. ఆసీస్ను కంగారెత్తిస్తోన్న బుమ్రా, షమీ!
ఆస్ట్రేలియా, టీమిండియా ఫైనల్ రసవత్తరంగా మారింది. 241 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 16ఓవర్లు ముగిసే సమమానికి 87 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.
ఆస్ట్రేలియా, టీమిండియా ఫైనల్ రసవత్తరంగా మారింది. 241 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 16ఓవర్లు ముగిసే సమమానికి 87 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 'ఫ్రీ పాలస్తీనా' టీ-షర్ట్ ధరించిన జాన్ అనే ఆస్ట్రేలియన్ పిచ్ మధ్యలోకి దూసుకొచ్చాడు. కోహ్లీని కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. అతడిని అహ్మదాబాద్లోని చంద్ఖేడా పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టైటిల్ ను ఆసిస్ కైవసం చేసుకుంది. ఆరోసారి ట్రోఫిని గెలుచుకుంది. హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియాపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇటు ఆసిస్ బౌలింగ్ దెబ్బకు అటు పరుగులు తీయలేక.. ఇటు వికెట్లు నిలుపుకోలేక విలవిల్లాడింది.
వరల్డ్కప్ ఫైనల్ ఫైట్కు సమయం దగ్గర పడింది. మధ్యాహ్నం 2గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. వన్డే ప్రపంచకప్లో ఇరు జట్లు 13సార్లు తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా 8సార్లు, ఇండియా 5సార్లు గెలిచాయి. ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఎవరు గెలుస్తారే దానిపై ఉత్కంఠ నెలకొంది.
గుజరాత్-గాంధీనగర్లోని అదాలజ్ స్టెప్వెల్లో వరల్డ్కప్ ఫైనలిస్టులు రోహిత్శర్మ, ప్యాట్ కమ్మిన్స్ ఫొటోషూట్లో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ట్రోఫీతో వీరిద్దరూ పోజులిచ్చారు.
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ ఫైట్ లక్షా 30వేల మంది అభిమానుల సమక్షంలో జరగనుంది. చుట్టూ అంత మంది భారత్కు సపోర్ట్ చేస్తున్నా.. తామే గెలుస్తాం అంటున్నాడు ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్. లక్షల మందిని సైలెంట్గా ఉండేలా చేయడం కంటే సంతృప్తికరమైనది మరొకటి ఉండదని చెబుతున్నాడు.
1983లో టీమిండియా క్రికెటర్లు ఒక్కో వన్డే మ్యాచ్కు రూ.1,500 జీతం తీసుకోగా.. ప్రస్తుతం ఒక్కో వన్డే మ్యాచ్కు భారత్ క్రికెటర్లు రూ.6లక్షల జీతం తీసుకుంటున్నారు. అటు టెస్టులకు అయితే ఒక్కో మ్యాచ్కు ఒక్కో ఆటగాడికి రూ.15లక్షలు చెల్లిస్తోంది బీసీసీఐ.
విశాఖలో ఈనెల 23 న ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగే టీ20 సిరీస్ టికెట్ల కోసం గంటల కొద్ది లైన్లో నిల్చున్నా టికెట్లు దక్కలేవని అభిమానులు వాపోయారు. టికెట్ల విషయంలో ప్రైవేట్ వ్యక్తులు తిష్ఠ వేశారని అధికార పార్టీ అండతో 'ఏసీఏ' ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఐసీసీ నాకౌట్లలో ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఇండియా నాలుగు సార్లు గెలవగా.. అందులో మూడుసార్లు యువరాజ్సింగ్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక నవంబర్ 19న జరగనున్న వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో యువరాజ్ స్థాయిలో ఎవరూ ఆడుతారన్నదానిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.