BREAKING: ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు కీలక పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు కీలక పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలపై ఇంకా క్లారిటీ రాలేదు. తమ పదవీకాలాన్ని పొడిగించాలని సర్పంచులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సర్పంచుల పదవీకాలం FEB 1తో ముగియనుంది.
మరోసారి సీఎం అయ్యేందుకు కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు చూస్తున్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చని అన్నారు. కాంగ్రెస్ జాగ్రత్తగా ఉండాలన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈరోజు ప్రారంభం కానుంది. మణిపూర్ నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నారు రాహుల్. మార్చి 20వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగనుంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నీటిపారుదలపై శ్వేతపత్రం సమర్పించడానికి సిద్ధం కావాలని..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శనివారం జలసౌదాలో నీటిపారుదలపై సమీక్ష నిర్వహించారు. నీటి విడుదల అంశాలపై అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు ఊరుకుంటారా? అని హరీష్ రావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు 24 గంటల కరెంట్ తెచ్చింది కేసీఆరే అని అన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేటీఆర్ బీఆర్ఎస్ ఓటమిని అంగీకరించే పరిస్థితిలో లేరని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చడం కాదు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్నే ప్రజలు మార్చారని చురకలు అంటించారు.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. షబ్బీర్అలీ, ఫిరోజాఖాన్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని సమాచారం.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి 10 స్థానాలకు గాను 9 స్థానాల్లో విజయం సాధించామని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రచారాల్లో కేసీఆర్ తమను టార్గెట్ చేశారని అన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు.