Khammam: వైరా బీఆర్ఎస్లో భగ్గుమన్న విభేదాలు
ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఎస్లో దళితబంధు చిచ్చు రేపింది. అక్కడ రాజకీయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మారింది.
ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఎస్లో దళితబంధు చిచ్చు రేపింది. అక్కడ రాజకీయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మారింది.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాకతీయ యూనివర్సిటీ వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్డీ అడ్మిషన్ విషయంలో మెరిట్పై మాట్లాడటానికి వెళ్లిన విద్యార్థి నేతలపై పోలీసులు దాడి చేయడం ఎంటన్నారు. వర్సిటీ వీసీ విద్యార్థులను కొట్టించారని ఈటల రాజేందర్ ఆరోపించారు.
హోంగార్డు రవీందర్ను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హొంగార్డు రవీందర్ ఆత్మహత్యయత్నంకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎంపీ డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ రాష్ట్రంలో ఇంతవరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగిగా ప్రకటించలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల అనంతరం మరోలా వ్యవహరించడం కేసీఆర్కు అలవాటైందన్నారు.
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి వెళ్లిన మంత్రిని గ్రామస్తులు అడ్డుకున్నారు. పట్టాలు లబ్దిదారులకు కాకుండా తన అనుచరులకు ఇస్తున్నారని వారు ఆరోపించారు.
సీఎం కేసీఆర్పై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి చెందిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ డబ్బులు పంచి తన అభ్యర్థిని గెలిపించుకున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
ఎన్నికల వ్యాహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతోందన్నారు. ఆ రాష్ట్రంలో జరిగిన అభివృద్దే అందుకు నిదర్శనమన్నారు. మరోవైపు రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టిపోటీ ఉంటుందన్నారు.
అలంపూర్ బీఆర్ఎస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అబ్రహంకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ.. ఎంపీపీ వర్గం భారీ ర్యాలీ నిర్వహించింది. అబ్రహం ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగితే తాము సహకరించేది లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్పై నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ జీవితం ప్రజలకే అంకితమన్న ఆయన.. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు.