Telangana: కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు
ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు ఇప్పుడు మరో వివిదంలో చిక్కుకున్నారు. తనను కిడ్నాప్ చేసి హింసించారని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒకరు ఆతని మీద కంప్టైంట్ చేశారు.
ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు ఇప్పుడు మరో వివిదంలో చిక్కుకున్నారు. తనను కిడ్నాప్ చేసి హింసించారని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒకరు ఆతని మీద కంప్టైంట్ చేశారు.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తాను పదవిలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. రాజ్భవన్ ఫోన్లను కూడా విడిచిపెట్టబడలేదన్నారు. ఇందుకు సంబంధించి బలమైన ఆధారాలున్నాయని తెలిపారు.
TS: ఈ నెల 18న పార్టీ ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బి ఫామ్ అందించనున్నారు. అలాగే కరువుతో అల్లాడుతున్న రైతులకు భరోసా ఇచ్చేందుకు కేసీఆర్ బస్సు యాత్రపై చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గజ్వేల్ నేత ఎలక్షన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. మదన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు.మదన్ రెడ్డి నర్సాపూర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఎంపీ టికెట్ రాలేదని నిరాశ పడ్డ మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈరోజు రాజయ్యతో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సమావేశం అయ్యారు కేసీఆర్. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ను గెలిపించాలని స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పజెప్పారు కేసీఆర్.
మాజీ సీఎం కేసీఆర్.. చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేరవేర్చలేదని ధ్వజమెత్తారు.
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు చుక్కెదురైంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని దివంగత ఎమ్మెల్యే సాయన్న, బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితలు రూ.కోట్లు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడాన్నివ్యతిరేకించిన పార్టీ సీనియర్ నేత సింగాపురం ఇందిరా నిరసనల నిర్వహణకు ప్లాన్ చేయగా.. కాంగ్రెస్ పెద్దల చొరవతో ఆమె వెనక్కి తగ్గింది. కానీ తాజాగా కడియం శ్రీహరి, ఇందిరా అనుచరుల మధ్య పార్టీలో చేరికల విషయమై మరోసారి వివాదం తలెత్తింది.
పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కుల్వకుంట్ల కుటుంబమే పెద్ద చెడ్డీ గ్యాంగ్ అని ఆరోపించారు.