Crime : యువతి అనుమానాస్పద మృతి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..!
రంగారెడ్డి జిల్లా కందివనంలో దారుణం చోటుచేసుకుంది. యువతి మానస అనుమానాస్పద మృతి చెందింది. తమ కూతురిపై రాములు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మానసను హత్య చేసి, ఏమి తెలియనట్టుగా తమతో కలిసి తిరిగాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
Rangareddy district: రంగారెడ్డి జిల్లా కందివనంలో దారుణం చోటుచేసుకుంది. యువతి మానస అనుమానాస్పద మృతి చెందింది. తమ కూతురిది హత్యే అని అంటున్నారు బాధిత కుటుంబసభ్యులు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాములు అనే వ్యక్తి తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశాడంటున్నారు.
మానసను హత్య చేసి, ఏమి తెలియనట్టు తమతో కలిసి తిరిగాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాములును అదుపులోకి తీసుకున్నారు. అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
Conistable case: మహిళా కానిస్టేబుల్ సూసైడ్లో బిగ్ ట్విస్ట్.. డైరీలో బయటపడ్డ సంచలనాలు!
పెళ్లి కావట్లేదని సూసైడ్ చేసుకున్న మహిళా కానిస్టేబుల్ నీల కేసులో సంచలనాలు బయటపడ్డాయి. ఆమె అనుమానస్పద మృతిపై RTV ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చేపట్టగా.. అధిక కట్నం ఇవ్వలేక, పేద ఇంట్లోకి వెళ్లలేక ఒత్తిడికి లోనై చనిపోయినట్లు వెలుగులోకి వచ్చింది.
Conistable case: పెళ్లి కావట్లేదని సూసైడ్ చేసుకున్నమహిళా కానిస్టేబుల్ నీల కేసులో సంచలనాలు బయటపడ్డాయి. జనగామ జిల్లాకు చెందిన నీల.. హన్మకొండ హెడ్క్వార్టర్స్లో AR కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆమె అనుమానస్పద మృతిపై RTV ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చేపట్టగా మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి ఆలస్యానికి వరకట్నమే కారణంగా బయటయపడగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
స్థాయికి మించిన కట్నం..
జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన హేమ్లాల్, చియా దంపతుల మూడో సంతానం నీల. నీలకు సునీత, సురేష్, సోనియా అనే ముగ్గురు తోబుట్టువులున్నారు. అయితే తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టింది నీల. ఈ క్రమంలోనే వచ్చిన సంబంధాల్లో ఎక్కువమంది వారి స్థాయికి మించిన కట్నం అడిగారు. నీల ఫ్యామిలీ ఇవ్వలేని స్థితిలో ఉంది.
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాపేద కుటుంబంలోకి వెళ్లలేక నీల మదనపడింది. ఉన్నతస్థాయి ఫ్యామిలీలకు కట్నం ఇవ్వలేక ఒత్తిడికి లోనైంది. తన పరిస్థితి ఏమిటంటూ తనలో తాను ఏడుస్తూ బాధనంతా డైరీలో రాసుకుంది. పెళ్లిపై తన కుటుంబం సరైన బాధ్యత తీసుకోలేదని కూడా మనస్థాపం చెందిన నీలిమ దారుణానికి పాల్పడింది. ఇక మరోవైపు నీల దండ్రి హేమ్ లాల్ మాత్రం తమకంటే ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్న అబ్బాయిలు చూడటానికి వస్తే.. తమ బిడ్డకు ఉద్యోగం ఉన్నందున ఎదురుకట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడని తెలుస్తోంది. ఇది కూడా నీలను ఒత్తిడికి గురిచేసినట్లు సమాచారం.