Pithapuram: పీక్ స్టేజీకి చేరిన అభిమానం.. ఫలితాలు రాకముందే పిఠాపురంలో హడావుడి.! పిఠాపురంలో కారు, బైకులపై స్టిక్కర్లు చర్చనీయాంశంగా మారాయి. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని పవన్ అభిమానులు, డిప్యూటీ సీఎం వంగాగీత అని వైసీపీ అభిమానులు తమ వాహనాలకు స్టిక్కర్లు అతికించుకున్నారు. అంతేకాకుండా, పిఠాపురంలో ఎవరు గెలుస్తారనే దానిపై కోట్లలో బెట్టింగ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 27 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Pithapuram Politics: ఎన్నికల ఫలితాలు రాకముందే పిఠాపురంలో హడావుడి మొదలైంది. కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నుండి వంగాగీత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే పవన్ అంటూ అభిమానులు తమ కారు, బైకులపై స్టిక్కర్లు అతికించుకున్నారు. మరికొందరేమో ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ స్టిక్కర్లు వేయించుకున్నారు. ఇలా పిఠాపురంలో కారు, బైకులపై స్టిక్కర్లు నగరం చర్చనీయాంశంగా మారాయి. Also Read: టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి సీతాదేవి గుండెపోటుతో మృతి.! ఫలితాలు రాకముందే వీరి అభిమానం పీక్ స్టేజీకి చేరింది. పవన్ కల్యాణ్, వంగాగీత ఫొటోలతో వారి అభిమానులు తమ వాహనాలకు కొత్త స్టిక్కర్లు అతికించుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా అంటూ కొన్ని స్టిక్కర్లు, మా ఎమ్మెల్యే గారూ పవన్ అంటూ అభిమానుల స్టిక్కర్లు నగరంలో హల్ చల్ చేస్తున్నారు. దీంతో ఇటు వంగాగీత అభిమానులు సైతం ఏమాత్రం తగ్గడం లేదు. డిప్యూటీ సీఎం వంగాగీత అంటూ కారుపై స్టిక్కర్లు అతికించుకున్నారు. ఇదిలా ఉంటే, పిఠాపురంలో ఎవరు గెలుస్తారనే దానిపై కోట్లలో బెట్టింగ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. #vanga-geeta #pawan-kalyan సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి