AP: పాలన చేతకాని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకు? జగన్‌పై పేడాడ పరమేశ్వరరావు విమర్శలు..!

పాలన చేతకాని వాడికి, ప్రతిపక్ష హోదా ఎందుకు అని మాజీ సీఎం జగన్‌పై శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు విమర్శలు చేశారు. ప్రపంచ బ్యాంకుకు రెగ్యులర్ ఖాతాదారుడుగా ఉన్న చంద్రబాబుకు కేంద్రం రూ. 15 వేల కోట్లు అప్పు ఇప్పించడం హాస్యాస్పదమన్నారు.

New Update
AP: పాలన చేతకాని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకు? జగన్‌పై పేడాడ పరమేశ్వరరావు విమర్శలు..!

Pedada Parameswara Rao: శ్రీకాకుళం జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. జగన్‌కు ప్రతి పక్ష హోదా ఎందుకు? ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేసారు?  ఇండియా కూటమి ఎందుకు సంఘీభావం తెలుపాలి? అని ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని బీజేపీకి ఐదేళ్లు తాకట్టు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేవలం పార్టీని పరిరక్షించుకునేందుకే ఢిల్లీలో దీక్ష చేశాడన్నారు. పాలన చేతకాని వాడికి, ప్రతిపక్ష హోదా ఎందుకు అని కౌంటర్లు వేశారు. ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాంకుకు రెగ్యులర్ ఖాతాదారుడుగా ఉన్న చంద్రబాబుకు కేంద్రం రూ. 15 వేల కోట్లు అప్పు ఇప్పించడం హాస్యాస్పదమన్నారు.

Also Read : కాల్ గర్ల్స్, రేప్ కేసు, డ్రగ్స్ బానిసలే టార్గెట్.. అందినంత దోచేస్తున్న ఫేక్ పోలీస్!


Advertisment
Advertisment
తాజా కథనాలు