Delhi: దిల్లీ లో భీభత్సం సృష్టించిన ఓ కారు..వీడియో వైరల్!

దిల్లీ లో ఓ కారు భీభత్సం సృష్టించింది. స్థానిక ఓ దుకాణంలోకి అతివేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదం గత నెల 31న జరగగా ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

New Update
Delhi: దిల్లీ లో భీభత్సం సృష్టించిన ఓ కారు..వీడియో వైరల్!

దిల్లీలోని సివిల్ లైన్స్‌లోని రాజ్‌పూర్ రోడ్‌లోని ఫతే చంద్ కచోరీ దుకాణం లోకి  మెర్సిడెస్ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలైయాయి. ఘటన అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారైయాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక తిరత్ రామ్ ఆసుపత్రిలో తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం. యూపీలోని నోయిడా ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల పరాగ్ మైనీ పని నిమిత్తం దిల్లీకి వచ్చాడు. ఆ సమయంలో కారు  అదుపుతప్పి స్థానిక దుకాణంలోకి అతివేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 5గురికి తీవ్రగాయాలవగా.. వారిని స్థానిక తిరత్ రామ్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం వాహనాన్ని సీజ్ చేసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని.. ప్రాథమిక వైద్య పరీక్ష ప్రకారం, డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవ్ చేశాడా లేదని రక్త నమూనా  సేకరించామని, విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వేగంగా వచ్చిన మెర్సిడెస్ కారు షాపులోకి ప్రవేశించినట్లు వీడియోలో చూడవచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు