Jaggareddy: మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..అప్పుడు కాళ్లు మొక్కి..ఇప్పుడు విమర్శలా?

మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..తాము తొడ కొడితే కేటీఆర్ గుండె అదురుతుందంటూ హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. నాడు కోదండరామ్ కాళ్లు మొక్కిన మీరు..నేడు ఆయన పై విమర్శలు చేసేందుకు సిగ్గుండాలి అంటూ ఫైర్ అయ్యారు.

New Update
Telangana: కవితకు నోటీసులు అందుకే పంపారు: జగ్గారెడ్డి

Jaggareddy: బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల కాలంలో చేయలేని పనిని రేవంత్ చేశాడని.. కేటీఆర్‌, హరీష్ రావుకు సిగ్గనిపిస్తాలేదా అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. కోదండరాంను ఎమ్మెల్సీగా అమోదించినందుకు.. గవర్నర్‌ను కాంగ్రెస్ తరపున అభినందిస్తున్నానని తెలిపారు. గవర్నర్ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారన్నారు. కేసీఆర్, హరీష్ రావులు.. ఈ నిర్ణయం పట్ల గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలపాలన్నారు.

తాము తొడ కొడితే కేటీఆర్ గుండె అదురుతది.. తాము దాదాగిరి చేస్తే తట్టుకోలేవని హెచ్చరించారు. బీజేపీతో ఫెవికాల్ బంధం కేసీఆర్‌దా.. కాంగ్రెస్‌దా అనేది తెలంగాణ ప్రజలకు తెలుసునని జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం.. భీష్మ పాత్ర పోషించారని తెలిపారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు.. ఈ రోజు కోదండరాం ఎమ్మెల్సీ నిర్ణయంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో వారు కోదండరాన్ని దేవుడిలా భావించి కాళ్లు మొక్కారని.. ఇప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమకారులపై ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా కాంగ్రెస్ పార్టీ సహకరించిందన్నారు. ఉద్యమంలో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించిందని..లబ్ది పొందింది మాత్రం మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పోరాటంలో భాగంగానే సమిష్టి నిర్ణయం మేరకు జేఏసీ ఏర్పాడిందన్నారు. పెద్ద మనిషిగా ఆరోజు జేఏసీ చైర్మన్ కోదండరాంను పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: అమ్మకాల్లో గ్రాంట్ విటారాను వెనక్కి నెట్టేసిన ఫ్రాంక్స్ …కేవలం పది నెలల్లోనే..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్ శర్మ ఏకంగా 10 సెక్స్లతో చెలరేగిపోయాడు.  అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment