TS: సీతారామ కెనాల్‌లో పడి చిన్నారి మృతి..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్లపెంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రాధమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న తోలెమ్ వరుణ్(7) అనే బాలుడు సీతారామ కెనాల్‌లో పడి మృతి చెందాడు. ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం కారణంగానే వరుణ్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు.

New Update
TS: సీతారామ కెనాల్‌లో పడి చిన్నారి మృతి..!

Khammam:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఆర్లపెంట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామంలో ప్రాధమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న తోలెమ్ వరుణ్(7) ని తల్లిదండ్రులు ఉదయం స్కూల్లో విడిచిపెట్టి వెళ్లారు. కొంతసేపటి తర్వాత మరో విద్యార్థితో కలిసి దగ్గరలోని సీతారామ ప్రాజెక్టు కెనాల్ వద్దకు వెళ్లిన వరుణ్ నీటిలో ఆడుకోవడానికి దిగి మునిగిపోయాడు.

Also Read: శ్రీశైలంలో తృటిలో తప్పిన ప్రమాదం.. హఠాత్తుగా డ్యామ్ గేట్లు తెరవడంతో..

సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు వెళ్లి చిన్నారిని బయటకు తీయగా అప్పటికే వరుణ్ మృతి చెందాడు. ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం కారణంగానే వరుణ్ కెనాల్ వద్దకు వెళ్ళి నీటిలో దిగి మృతి చెందాడని కుటుంబ సభ్యులు స్కూలుకు తాళాలు వేసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు