భూ వివాదం కుటుంబంలోని 5గురి ప్రాణాలు తీసింది..!

రెండెకరాల భూమి కోసం ఓ మాజీ సైనికుడు తన తల్లి, సోదరుడు, భార్య, కొడుకు, కూతురిని హత్య చేయడం హర్యానాలో కలకలం సృష్టించింది. ఈ దాడిలో గాయపడిన నిందితుడి తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
భూ వివాదం కుటుంబంలోని 5గురి ప్రాణాలు తీసింది..!

రెండెకరాల భూమి కోసం ఓ మాజీ సైనికుడు తన తల్లి, సోదరుడు, భార్య, కొడుకు, కూతురిని హత్య చేయడం కలకలం హర్యానాలో సృష్టించింది. హర్యానాలోని నారాయణనగర్‌లో సోదరుడు హరీష్ (35), భార్య సోనియా (32), తల్లి సరోబి (65), ఐదేళ్ల కుమార్తె, ఆరు నెలల కుమారుడు సహా ఐదుగురిని మాజీ సైనికుడు భూషణ్ కత్తితో పొడిచి చంపాడు. గాయపడిన తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని  అరెస్టు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు