Sai Durga Tej : పీరియాడిక్ మూవీలో సాయి తేజ్.. సెట్ అవుతాడా? సాయి తేజ్ నెక్స్ట్ మూవీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో ఉండబోతోందట. హనుమాన్ నిర్మాత కె.నిరంజన్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమాని రాకేష్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. By Anil Kumar 28 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Sai Tej New Movie Update : సుప్రీమ్ హీరో సాయి తేజ్(Sai Tej) గత ఏడాది 'విరూపాక్ష' సినిమాతో భారీ కం బ్యాక్ అందుకున్న విషయం తెలిసిందే. సస్పెన్స్ అండ్ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ తర్వాత మావయ్య పవన్ కళ్యాణ్ తో 'బ్రో'(Bro) సినిమాలో నటించాడు. 'బ్రో' తర్వాత సాయి తేజ్ నుంచి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఆమధ్య సంపత్ నందితో 'గాంజా శంకర్' అనే సినిమాని అనౌన్స్ చేసినా.. పలు అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ క్రమంలోనే సాయి తేజ్ నెక్స్ట్ చేయబోయే సినిమాపై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇలాంటి తరుణంలో సాయి తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఓ క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది. పీరియాడిక్ మూవీలో సాయి తేజ్ లేటెస్ట్ ఫిలిం నగర్(Film Nagar) టాక్ ప్రకారం.. సాయి తేజ్ నెక్స్ట్ మూవీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో ఉండబోతోందట. హనుమాన్ నిర్మాత కె.నిరంజన్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమాని రాకేష్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. సాయి తేజ్ కేరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూ పొందనున్న ఈ సినిమా 1940 బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటివరకు సాయి తేజ్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీస్ లో నటించింది లేదు. మొదటి సారి ఈ జోనర్ ని టచ్ చేస్తుండటంతో ఫిలిం సర్కిల్స్ లో ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది జూలై నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని ఆఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. Also Read : మతం మారే ఆలోచనలో అమీర్ ఖాన్.. కారణం? #sai-durga-tej #sai-tej-new-movie #sai-tej సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి