Gun Misfired: హైదరాబాద్లో కలకలం.. గన్తో కాల్చుకున్న ఆర్ఎస్ఐ హైదరాబాద్ ఓల్డ్సిటీలో గన్తో కాల్చుకుని ఆర్ఎస్ఐ బాలేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న సౌత్జోన్ డీసీపీ సాయిచైతన్య ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. By Vijaya Nimma 07 Apr 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Hyderabadi RSI Baleshwar Incident: హైదరాబాద్ ఓల్డ్సిటీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గన్తో కాల్చుకుని ఆర్ఎస్ఐ బాలేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుస్సేనీ ఆలం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట్ మండలం లక్ష్మీపూర్కి చెందిన RSI బాలేశ్వర్ టీఎస్ఎస్పీ రిజర్వ్ ఎస్ఐగా కబూతర్ఖానాలో పనిచేస్తున్నాడు. ఈ రోజు (ఆదివారం) ఉదయం తన గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న సౌత్జోన్ డీసీపీ సాయిచైతన్య రంగలోకి దిగి వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. బాలేశ్వర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలేశ్వర్ మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్ఎస్ఐ బాలేశ్వర్ మృతితో గ్రామంలో, కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది కూడా చదవండి: హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం #gun-misfired సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి