Gaddar Jayanthi : నా మాటే శాసనం .. గద్దర్ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ జయంతి వేడుకల్లో నంది అవార్డుల పేరును గద్దర్‌ అవార్డుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై గద్దర్‌ జయంతి రోజు కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్‌ అవార్డులు ప్రధానం చేస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

New Update
Gaddar Jayanthi : నా మాటే శాసనం .. గద్దర్ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Gaddar Awards: తన పాటతో  జన జీవనాన్ని  చైతన్యపరిచి..బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిర్విరామకృషి చేసి, సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గళం విప్పిన ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి (Gaddar Jayanthi ) వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. రవీంద్రభారతిలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొని గద్దర్కు నివాళులు అర్పించారు. సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దరన్న అని ఆయన గొప్పవ్యక్తిత్వాన్నిరేవంత్ రెడ్డి కొనియాడారు.

త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమం మొదలు పెట్టిన వ్యక్తి గద్దరన్న అని ..త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదనే ఉద్దేశ్యంతో మళ్లీ ఉద్యమం మొదలు పెట్టింది గద్దరన్న అని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దరన్న మాటలు మాకు  ఎల్లపుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. గద్దర్ తో మాట్లాడిన ప్రతీ మాట మాకు  వెయ్యేనుగుల బలంగా ఉంటుందని , ఆ బలంతోనే గడీల ఇనుప కంచెల బద్దలు కొట్టి ప్రజాప్రభుత్వంలో జ్యోతిరావు పూలే భవన్ గా మార్చామని అన్నారు.

దళితుడిని సీఎం చేస్తానని మాట ఇచ్చి మోసం చేసిన కేసీఆర్ 

ఇక.. దళితులకు అగ్రస్థానం కల్పిస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ మాటలు గుర్తుచేస్తూ..ఏ దళితుడిని సీఎం చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మోసం చేశారో...మా ప్రజా ప్రభుత్వంలో ఆ దళితుడికే వచ్చి ఎమ్మెల్సీ కవిత పూలే విగ్రహం కోసం వినతిపత్రం ఇచ్చారని, ఎవరైనా వచ్చి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో ఉందని అన్నారు.

గద్దరన్న విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు

గద్దరన్న విగ్రహాన్ని (Gaddar Statue) ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ విషయాన్నీ కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.ఇక.. ప్రతిపక్షనాయకుల గురించి మాట్లాడుతూ .. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకులు శపనార్ధాలు పెడుతున్నారని అన్నారు. ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారంటూ కొందరు కలలు కంటున్నారు...అలాంటి ఆలోచన చేసిన వారిని తెలంగాణ ప్రజలు ఘోరీ కడతారు.అది వాళ్ల ఒంటికి.. ఇంటికి మంచిది కాదంటూ మండిపడ్డారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని . ఐదేళ్లు సుస్థిరమైన పాలన అందించే బాధ్యత మాది అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు.

నంది అవార్డుల పేరును గద్దర్‌ అవార్డుగా మారుస్తూ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ జయంతి వేడుకల్లో నంది అవార్డుల (Nandi Awards) పేరును గద్దర్‌ అవార్డుగా (Gaddar Awards) మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై గద్దర్‌ జయంతి రోజు కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్‌ అవార్డులు ప్రధానం చేస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఈ వేదికగా చెబుతున్నా.. ఇదే శాసనం.. ఇదే జీవో..అంటూ రేవంత్ రెడ్డి జీవో పాస్ చేశారు. ఈ పురస్కారాలతో ఆయన్ను స్మరించుకునే అవకాశం తెలుగు ప్రజలకు ఉండాలనే  ఉద్దేశ్యంతో  తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్భయం తీసుకుందని అన్నారు.  రవీంద్రభారతిలో ఘనంగా జరుగుతున్న ఈ వేడుకలకు గాయకులు,కళాకారులు గద్దర్ పాటలను పాడుతూ ఆయన జ్ఞాపకాలు స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.స‌మాజంలో ఉన్న అంత‌రాలు తొల‌గించాల‌ని త‌న జీవితాంతం ప‌రిత‌పించి, త‌న గ‌ళంతో జనాలలో చైతన్య స్ఫూర్తిని రగిలించారని ఈ సంద‌ర్భంగా గ‌ద్ద‌ర్ సేవ‌లను గుర్తు చేశారు.

ALSO READ :గద్దరన్న జీవితమే ఓ పోరాటం-జనసేన

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Russia-Ukrain-Putin: ఉక్రెయిన్‌ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!

ఉక్రెయిన్‌ తో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్నారు. ముందస్తు షరతులు లేకుండానే వీటికి సిద్ధమని స్పష్టం చేశారు.అమెరికా ప్రతినిధి స్టీవ్‌విట్కోఫ్‌ తో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.

New Update
 putin

putin Photograph: (putin )

ఉక్రెయిన్‌ తో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్నారు. ముందస్తు షరతులు లేకుండానే వీటికి సిద్ధమని స్పష్టం  చేశారు.రష్యా పర్యటనలో ఉన్న అమెరికా ప్రతినిధి స్టీవ్‌విట్కోఫ్‌ తో ఈ విషయాన్ని వెల్లడించినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌తో చర్చలకు సంబంధించిన విషయాన్ని పుతిన్‌ చాలాసార్లు స్పష్టం చేశారని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ వెల్లడించారు.

Also Read:పాక్‌కు ఎగుమతులు ఆపేసిన భారత్.. భారీగా తగ్గనున్న వస్తువులు

యుద్ధం ముగించేందుకు చర్చల కోసం ప్రయత్నాలు జరుపుతున్న వేళ ఉక్రెయిన్‌ పై రష్యా భీకర దాడులకు పాల్పడుతుండటం పై ట్రంప్‌ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాల పై రష్యా సైన్యం దాడులు జరపడం చూస్తుంటే పుతిన్‌ కు యుద్ధం ఆపడం ఇష్టం లేదని అనిపిస్తోందన్నారు.

Also Read: Omar Abdullah: పాక్‌ ప్రధానిపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

అనేక మంది చనిపోతున్నారని,మాస్కో పై మరిన్ని ఆంక్షల పై ఆలోచించక తప్పదన్నారు.రోమ్‌ లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో భేటీ అయిన తరువాత సొంత సోషల్‌ మీడియా వేదిక పై ట్రంప్‌ ఈ విధంగా స్పందించారు. అంతకుముందు రష్యాకు అనుకూలంగా మాట్లాడిన ట్రంప్‌..క్రిమియా రష్యాతోనే ఉంటుందని అన్నారు.

ఆ ప్రాంతం రష్యాతో ఉన్నవిషయాన్ని జెలెన్‌ స్కీ సహా ప్రతి ఒక్కరూ త్వరలో అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. మరో వైపు భీకర దాడులను ఆపాలని, ఇప్పటికైనా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని పుతిన్‌ కు చెప్పిన కొన్ని గంటల్లోనే మాస్కో నుంచి సానుకూల స్పందన రావడం మరో విశేషం.

Also Read:BIG BREAKING: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

Also Read:Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

putin | russia | zelensky | putin vs zelensky | ukraine-zelenskyy | zelensky vs putin | ukrain | trump | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు