Revanth Reddy: ఆయన నా గురువు కాదు.. సహచరుడు.. చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలకు రేవంత్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. చంద్రబాబు తనకు గురువు కాదని, తన సహచరుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో షర్మిలను ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని చెప్పారు. 

New Update
CM Revanth : జీవన్ రెడ్డి విషయంలో తప్పు మాదే.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Revanth Reddy:ఎన్నికల వేళ నేతల మాటల  తూటాలు పేలుతున్నాయి. ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో రేవంత్ కోసమే టీడీపీ పోటీచేయకుండా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు తనదైన శైలిలో తిప్పికొట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 

Revanth Reddy: ఒక ఇంటర్వ్యూలో మీ గురువు చంద్రబాబు కోసం శిష్యుడు ఏదైనా చేసేది ఉందా? అని వచ్చిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి సూటిగా సమాధానం చెప్పారు. తనకు గురువు ఎవరూ లేరని.. చంద్రబాబు తనకు గురువు కాదని.. తానూ అయన సహచరుడినని పేర్కొన్నారు. అంతేకాదు ఎవడైనా బుద్ధిలేని వెధవ గురు..శిష్యులు అని చెత్త వాగితే వాడిని తన్నడం పక్కా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Also Read: బాబాయ్‌ కోసం అబ్బాయి…పిఠాపురానికి చరణ్‌!

Revanth Reddy:తాను మొదట ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ అయ్యానని రేవంత్ చెప్పారు. తరువాత టీడీపీలో చేరానని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కాబట్టి పార్టీ అధినేతగా తాను ఆయనకు అపారమైన గౌరవం ఇస్తానని అన్నారు. అంతేకానీ, తామిద్దరమూ గురుశిష్యులం కాదని స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అని.. తమ పార్టీ ఆమెను ఏపీ ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటే, తానూ అందుకోసమే తాను పనిచేస్తానని అన్నారు. దానికోసమే తానూ వైజాగ్ వెళ్లి ప్రచారం చేసి వచ్చానని చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Kodandarama Swamy Temple: హనుమంతుడి లేని రామాలయం..మన దగ్గరే..ఎన్నో ప్రత్యేకతలు!

ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణులతో పాటుగా ఆంజనేయడు కూడా కొలువై ఉంటాడు. రాములోరి సేవలో తరిస్తూ భక్తుల పూజలు అందుకుంటూ ఉంటాడు. కానీ ఆంజనేయుడు లేని రామాలయం ఒకటుందని.. మీకు తెలుసా.. ఆ ఆలయం గురించి ఈ కథనంలో..

New Update
hanuman

hanuman

రామాలయం లేని ఊరు.. హనుమంతుడు లేని రాములోరి ఆలయం ఉండదనేది పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ హనుమంతుడు లేని రామాలయం కూడా ఒకటి ఉంది. అది కూడా మరెక్కడో కాదు సాక్షాత్తు  ఏపీలోనే ఉందని తెలుసా.. అదే వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం. అన్ని ఆలయాల్లో సీతారామలక్ష్మణ ఆంజనేయస్వాములు కనిపిస్తే ఇక్కడ మాత్రం ఆంజనేయస్వామి ఉండరు. దాని వెనుక కూడా ఆసక్తికరమైన కథ ఉంది. 

Also Read: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఆంజనేయస్వామిని కలవకముందే.. ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు సంచరించారని.. అందుకే ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదనేది స్థానికులు చెబుతారు.ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. అందుకే ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు దండకారణ్యంలో సంచరిస్తూ ఇక్కడకు వచ్చారని పురాణాలు చెప్తున్నాయి. 

Also Read: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

ఆ సమయంలో సీతాదేవికి బాగా దప్పిక వేసిందని.. సీతాదేవి దాహం తీర్చేందుకు శ్రీరాముడు భూమిలోనికి బాణం వేస్తే నీటిబుగ్గ పుట్టిందని పురాణాల్లో ఉంది. అదే ఒంటిమిట్ట రామతీర్థం అయ్యిందని చెప్తుంటారు.ఇక ఈ ఆలయం పేరుపైనా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కోదండరామస్వామి ఆలయాన్ని మిట్టమీద నిర్మించారని.. అందుకే ఒంటిమిట్ట రామాల‌యం అని పేరు వ‌చ్చింద‌ని కొంతమంది చెప్తుంటారు. అయితే ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ‌భ‌క్తులు ఈ గుడిని నిర్మించారని.. వారి పేరుమీద ఒంటిమిట్ట రామాలయం అయ్యిందనేది మరో వాదన. సీతారాముల క‌ల్యాణం త‌ర్వాత మృకండ మహర్షి, శృంగి మహర్షి యాగ రక్షణ కోసం శ్రీరామలక్ష్మణులు ఇక్కడ‌కు వ‌చ్చారని.. అందుకు ఆ మ‌హర్షులు సీతారామ ల‌క్ష్మణుల విగ్రహాల‌ను ఇక్కడ ఏర్పాటు చేయించారని మరో కథనం. ఆ విగ్రహాలకు తర్వాత కాలంలో జాంబవంతుడు ప్రాణ ప్రతిష్ట చేశాడ‌ని మరికొందరు అంటుంటారు.

ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కళ్యాణం రాత్రి వేళ ఎందుకు జరుగుతుందనే దానికి కూడా ఆసక్తికరమైన కథ ఉంది. అది కూడా శ్రీరామనవమి రోజున కాకుండా చైత్ర శుద్ధ పౌర్ణమి రాత్రి జరుగుతుంది. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వివాహం పగలు జరిగినప్పుడు, చంద్రుడు తన సోదరి లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోయానని విష్ణువుతో మొరపెట్టుకున్నాడట. దీంతో "నీ కోరిక రామావతారంలో తీరుతుంది" అని మహా విష్ణువు వరమిచ్చాడు. 

ఆ ప్రకారం ఒంటమిట్టలో సీతారాముల కళ్యాణం వెన్నెల వెలుగుల్లో నిర్వహిస్తారు. ఇక ఒంటిమిట్ట ఆలయ గోపురాలు చోళ శైలిలో, రంగమంటపం విజయనగర శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. 32 స్తంభాలతో కూడిన రంగమంటపం, 160 అడుగుల ఎత్తైన గోపురం దీని సౌందర్యాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.

Also Read: Iran: చరిత్రలో రికార్డ్ స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ విలువ.. డాలర్‌కు 10 లక్షల రియాల్స్‌..

Also Read: Sri Rama Navami 2025: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే

 

 kadapa | vontimitta-kodandaram | temple | sri-rama-navami | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment