Revanth Reddy: కుంభం అనిల్‌కు కాంగ్రెస్‌లో సముచిత స్థానం కల్పిస్తాం: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ నేత కుంభం అనిల్‌ కుమార్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కుంభం అనిల్‌ భువనగిరిలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారని తెలిపారు. కొంతమంది ఓడిపోతే పారిపోతారని.. కానీ అనిల్‌ మాత్రం కార్యకర్తలను కాపాడుకుని నిలబడ్డారన్నారు.

New Update
Revanth Reddy: కుంభం అనిల్‌కు కాంగ్రెస్‌లో సముచిత స్థానం కల్పిస్తాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy: బీఆర్ఎస్ నేత కుంభం అనిల్‌ కుమార్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కుంభం అనిల్‌ భువనగిరిలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారని తెలిపారు. కొంతమంది ఓడిపోతే పారిపోతారని.. కానీ అనిల్‌ మాత్రం కార్యకర్తలను కాపాడుకుని నిలబడ్డారన్నారు. అనిల్‌కు హైకమాండ్‌ దగ్గర మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు. కొన్ని అపోహలు, గందరగోళం ఏర్పడిన సమయంలో... ఎమోషనల్‌ అయి అనిల్‌ ఒక నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారన్నారు. కాంగ్రెస్‌ జెండా మోసిన వాళ్లంతా చాలా ఇబ్బంది పడ్డారని.. ఇవన్నీ చూసిన అనిల్‌ కూడా మనసు మార్చుకున్నారన్నారు.

భువనగిరి నియోజకవర్గంపై తాము కూడా సర్వే చేయగా 99 శాతం మంది అనిల్‌కు పాజిటివ్‌గా ఉన్నారని వ్యాఖ్యానించారు. జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆ సర్వే ఫలితాలను మాకు చెప్పారన్నారు. అధిష్టానం ఆదేశాలతోనే కుంభం అనిల్‌తో మాట్లాడామని.. మనస్పూర్తిగా అనిల్‌ను పార్టీలోకి తిరిగి స్వాగతిస్తున్నామన్నారు రేవంత్. అనిల్‌కు సముచిత స్థానాన్ని కాంగ్రెస్‌లో కల్పిస్తామని.. ఇక తాను కూడా నిశ్చితంగా నిద్రపోతానని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

తాను సున్నిత మనస్కుడినని కుంభం అనిల్‌ తెలియజేశారు. ఏదో బాధతో నెల రోజులు ఇబ్బంది పడ్డానని.. ఆవేశంలో ఓ నిర్ణయం తీసుకుని పక్కకు వెళ్లానని తెలిపారు. రెండు నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నానని..కార్యకర్తలు తనను బాగా కాపాడుకున్నారని అనిల్‌ పేర్కొ్న్నారు. కేసీ వేణుగోపాల్‌ కూడా తనకు ఫోన్‌ చేసి మాట్లాడారని. త్వరలోనే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలుస్తానని అనిల్ ప్రకటించారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనానికి బ్రేక్?.. షర్మిల సంచలన వాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK Vs SRH: చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ సీఎస్కే vs ఎస్‌ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్‌ గెలిచిన SRH జట్టు.. బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో CSKజట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ రెండు జట్లు పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

New Update
CSK Vs SRH

CSK Vs SRH Photograph: (CSK Vs SRH)

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ సీఎస్కే vs ఎస్‌ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్‌ గెలిచిన SRH జట్టు.. బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో CSK జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. రెండు జట్లు పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాయి. వరుసగా పరాభవాలతో రెండు జట్లలోనూ ఆత్మవిశ్వాసం లోపించింది. ఆరేసి ఓటములు, రెండేసి విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. 

ధోనీ 400వ టీ20 మ్యాచ్‌

ఇదిలా ఉంటే సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇది 400వ టీ20 మ్యాచ్‌. అతడు తన కెరీర్‌లో 400వ టీ20 మ్యాచ్‌‌ను SRHతో ఆడనున్నాడు. దీంతో భారత్‌ నుంచి నాలుగో ప్లేయర్‌గా ధోనీ నిలిచాడు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 24వ ఆటగాడిగా ఉన్నాడు. ధోనీ కంటే ముందు మరో ముగ్గురు ఉన్నారు. వారు.. రోహిత్ శర్మ 456 మ్యాచ్‌లు, దినేశ్‌ కార్తిక్ 412 మ్యాచ్‌లు, విరాట్ కోహ్లీ 408 మ్యాచ్‌లు ఆడారు. ఆ తర్వాత స్థానంలో ధోనీ ఈ ఘనత అందుకొన్నారు. ధోనీ ఇప్పటివరకు 399 మ్యాచులు ఆడాడు. అందులో మొత్తం 7,566 పరుగులు చేశాడు.

telugu-news | IPL 2025 | latest-telugu-news | CSK Vs SRH

Advertisment
Advertisment
Advertisment