సీఎంగా పవన్..? రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. ఏం అన్నారంటే?

పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా అన్న అంశంపై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసని, దేవుడు ఏం రాసిపెడితే అది జరుగుతుందన్నారు రేణు. ఈ విషయంలో అభిప్రాయం చెప్పడానికి నేనెవర్ని? అని కామెంట్స్ చేశారు. పవన్ సీఎం అవ్వడం తనకు ఇష్టం లేదు అనే అర్థం వచ్చే విధంగా రేణు మాట్లాడినట్టుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

New Update
సీఎంగా పవన్..? రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. ఏం అన్నారంటే?

Renu Desai Comments On Pawan Kalyan: ప్రముఖ నటి రేణూ దేశాయ్ (Renu Desai) నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. రవితేజ ప్రధాన పాత్ర పోషించిన ఈ బయోపిక్ మూవీ ఇటీవలే రిలీజైంది. ఈ చిత్రంలో ప్రముఖ సంఘసంస్కర్త హేమలతా లవణం పాత్రను రేణూ దేశాయ్ పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) సీఎం అవ్వాలని కోరుకుంటున్నారా? అన్న ప్రశ్నకు రేణూ స్పందించారు.

Also Read: యంగ్ స్టార్ తో అర్జున్ కుమార్తె లవ్..పెళ్లికి గ్రీన్ సిగ్నల్..!

publive-image

రేణు దేశాయ్ స్పందిస్తూ తనకు ఈ క్వశ్చన్ ఏ వద్దు అన్నారు. ఆయన సీఎం అవుతారా లేదా అన్నది తనకు సంబంధం లేని విషయమని, తాను ఏమీ కోరుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలా వద్దా అనేది దేవుడు నిర్ణయిస్తారని దాని గురించి చెప్పడానికి తాను ఎవరు అంటూ ఆమె పేర్కొన్నారు. ఎవరికి ఏం రాసి ఉందో అదే జరుగుతుందని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మీరు ఎటువంటి స్టాండ్ తీసుకోరా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. నేను ఎవరి గురించి ఎలాంటి స్టాండు తీసుకోను అంటూ రేణు దేశాయ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా అన్న అంశంపై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ సీఎం అవ్వడం తనకు ఇష్టం లేదు అనే అర్థం వచ్చే విధంగా రేణు మాట్లాడినట్టుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

publive-image

మోడలింగ్ రంగంలో నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ తో చేసిన మొదటి సినిమాతోనే ఆమె భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బద్రీ’ (Badri) సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసిన నటించిన రేణూ దేశాయ్.. పవన్‌తో తొలి పరిచయంతోనే ప్రేమలో పడ్డారు. అయితే చాలా కాలం పాటు బాగానే సాగిన వీళ్ల కాపురంలో మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉండగా, రేణుదేశాయ్‌ సినిమా వైపు అడుగులు వేశారు. కొన్ని సినిమాలకు దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ముద్రవేశారు రేణూ దేశాయ్.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack పహల్గామ్ లో బిగ్ బాస్ నటి కాజల్.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే!

బిగ్ బాస్ ఫేమ్ నటి RJ కాజల్ కూడా దాడి సమయంలో పహల్గామ్ లోనే ఉండడం ఆమె అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కాజల్ తాను క్షేమంగా ఉన్నానని తెలియజేస్తూ ఇన్ స్టాలో వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను పహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాని తెలిపింది.

New Update
rj kajal in  Pahalgam attack

rj kajal in Pahalgam attack

Rj Kajal: కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్ని కలచివేస్తోంది. మినీ స్విజ్జర్ ల్యాండ్ గా పేరొందిన పహల్గామ్ ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులను దారుణంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు. ఈ దాడిలో 29 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటపడ్డారు. 

పహల్గామ్ లో కాజల్ 

అయితే బిగ్ బాస్ ఫేమ్ నటి RJ కాజల్ కూడా దాడి సమయంలో పహల్గామ్ లోనే ఉన్నారు. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కాజల్ తాను క్షేమంగా ఉన్నానని తెలియజేస్తూ ఇన్ స్టాలో వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను పహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాని తెలిపింది. నాకు కోసం ఆలోచించిన అందరికీ కృతజ్ఞతలు అని చెప్పింది.  ''పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నన్ను ఎంతో బాధించింది.  ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు, అధికారులు ఎంతో కృషిచేస్తున్నారు. ఇప్పుడు కాశ్మీర్ ప్రశాంతంగా, సేఫ్ గా ఉంది'' అంటూ వీడియోను షేర్ చేసింది. 

 latest-news | telugu-news | cinema-news

Also Read: Pahalgam Terror Attack-Tollywood: క్షమించరాని క్రూరమైన చర్య..ఉగ్రదాడిని ఖండించిన సినీ ప్రముఖులు!

Advertisment
Advertisment
Advertisment