Delhi: బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు బ్యాడ్మింటన్ ఆడారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో షట్లర్ సైనా నెహ్వాల్‌తో కలిసి ఆమె బ్యాడ్మింటన్ ఆడారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

New Update
Delhi: బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌తో కలిసి కాసేపు కోర్టులో షటిల్ ఆడారు. రేపు రాష్ట్రపతి భవన్‌లో మహిళా పద్మశ్రీ, పద్మభూషణ్‌లో కలిసి ద్రౌపది ముర్ము ముఖాముఖి కానున్నారు. ఈ కార్యక్రమంలో సైనా నెహ్వాల్ ప్రత్యేక అతిధిగా పాల్గొనడమే కాకుండా అందులో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా సైనా ఒకరోజు ముందే ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు రాష్ట్రపతికి కూడా కాస్తంత సమయం దొరకడంతో సైనాతో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు. వీరి ఆటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను సైనానే స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు