Rajinikanth: తాను పని చేసిన బస్సు డిపోకు వెళ్లిన తలైవా.... రజనీ సింప్లిసిటీని చూసి అభిమానులు ఫిదా...!

ఎంత ఎదిగినా అంత ఒదిగి వుండే వ్యక్తి సూపర్ స్టార్ రజనీ కాంత్. ఆసియాలోనే టాప్ హీరోల్లో ఒకరిగా వున్నా అత్యంత సాధారణ వ్యక్తిలా ఉండటం ఆయనకు మాత్రమే సాధ్యం. మనం ఏ స్థాయిలో వున్నా మన మూలాలను మరచి పోకూడదని నమ్మే వ్యక్తి ఆయన. అందుకే ఆయన సూపర్ స్టార్ స్థాయిలో వున్న తన పాత రోజులను మరచి పోలేదు. అందుకే కర్ణాకటలో తాను కండక్టర్ గా పని చేసిన బస్సు డిపోకు వెళ్లారు.

author-image
By G Ramu
New Update
Rajinikanth: తాను పని చేసిన బస్సు డిపోకు వెళ్లిన తలైవా.... రజనీ సింప్లిసిటీని చూసి అభిమానులు ఫిదా...!

Rajinikanth Surprise Visit to Bus Depot: ఎంత ఎదిగినా అంత ఒదిగి వుండే వ్యక్తి సూపర్ స్టార్ రజనీ కాంత్. ఆసియాలోనే టాప్ హీరోల్లో ఒకరిగా వున్నా అత్యంత సాధారణ వ్యక్తిలా ఉండటం ఆయనకు మాత్రమే సాధ్యం. మనం ఏ స్థాయిలో వున్నా మన మూలాలను మరచి పోకూడదని నమ్మే వ్యక్తి ఆయన. అందుకే ఆయన సూపర్ స్టార్ స్థాయిలో వున్న తన పాత రోజులను మరచి పోలేదు. అందుకే కర్ణాకటలో తాను కండక్టర్ గా పని చేసిన బస్సు డిపోకు వెళ్లారు.

బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (BMTC)కి ఆయన ఓ సాధారణ వ్యక్తిలా వెళ్లాడు. దీంతో అక్కడ వున్న వాళ్లంతా రజనీకాంత్ ను చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ డ్రైవర్లు, కండక్టర్లతో ఆయన కాసేపు ముచ్చటించారు. దీంతో సిబ్బంది అంతా ఆనందంలో మునిగి పోయారు. ఆయనతో కలిసి సెల్ఫీలు దిగి మురిసి పోయారు. కాసేపటికే ఈ వార్త వైరల్ అయింది.

ఈ క్రమంలో ఆయన్ని చూసేందుకు అభిమానులు డిపోకు వెళ్లారు. రజనీకాంత్ అత్యున్నత స్థితిలో వున్నప్పటికీ తాను గతంలో పని చేసిన డిపోను గుర్తు పెట్టుకుని రావడం చాలా గొప్ప విషయం అని సిబ్బంది అంటున్నారు. బస్ డిపోను రజనీకాంత్ సందర్శించిన సందర్బంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన సింప్లిసిటీకి అందరూ ఆశ్చర్య పోతున్నారు.

రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్ (Shivaji Rao Gaikwad). సినిమాల్లోకి రాక మందు ఆయన బస్సు కండక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత ఆయన సినిమా రంగంలోకి వచ్చాక ప్రముఖ లెజెండరీ డైరెక్టర్ బాలచందర్ ఆయనకు రజనీకాంత్ (Rajinikanth)గా పేరు పెట్టారు. అపూర్వ రాగంగల్ సినిమాతో రజనీకాంత్ కు మంచి బ్రేక్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి రజనీకాంత్ వెనక్కి తిరిగి చూడలేదు.

Also Read: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్ వారసుడు జాసన్ సంజయ్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అనుమతించింది. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బిరిపోర్ట్ విభేదిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

Advertisment
Advertisment
Advertisment