Rahul Gandhi: రాహుల్‌ పెళ్లి చేసుకోబోయేది ఆమెనేనా?

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ త్వరలోనే షోలాపూర్ లోక్‌ సభ సభ్యురాలు ప్రణీతి షిండే ను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సునీల్ కుమార్ కూతురే ప్రణీతి షిండే.

New Update
Rahul Gandhi: రాహుల్‌ పెళ్లి చేసుకోబోయేది ఆమెనేనా?

Rahul Gandhi: భారతదేశంలో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్స్‌ లో కాంగ్రెస్‌ లోక్‌ సభ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఒకరు. గత కొంత కాలంగా ఆయన పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఎన్నికల సమయంలో కూడా రాయబరేలిలో రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన వచ్చింది.

అప్పుడు కూడా వివాహం ఎప్పుడు చేసుకుంటారని అడిగిన కూడా రాహుల్ గాంధీ ఈ విషయాన్ని నవ్వుతూ తప్పిస్తున్నారే తప్ప సమాధానం మాత్రం చెప్పడం లేదు. దీంతో చాలామంది నేతలు అసలు రాహుల్ గాంధీ చేసుకుంటారా లేదా అనే సందేహం కూడా వెల్లిబుచ్చారు. రాహుల్ గాంధీ వయసు ప్రస్తుతం 54 ఏళ్లు.. ప్రియాంక గాంధీ పెళ్లికూతురుని వెతికే పనిలో పడ్డట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదంతా ఇలా సాగుతుండగా.... పెళ్లి కూతురు దొరికిందని ఆమె వయసు 42 ఏళ్ళని ఆమె మరెవరో కాదు ప్రణితి షిండే అన్నట్లుగా వార్తలు ఒక్కసారిగా తెరమీదరకు వచ్చాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సునీల్ కుమార్ కూతురే ప్రణీతి షిండే.. ఈమె షోలాపూర్ లోక్‌ సభ సభ్యురాలు . అయితే వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతుండడంతో త్వరలోనే వీరి వివాహం చేసుకోబోతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అయితే ఈ పెళ్లి గురించి అటు రాహుల్ గాంధీ కానీ ప్రణతి షిండే కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. సోషల్ మీడియాలో మాత్రం పలు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అటు రాహుల్ గాంధీ, ప్రణతి షిండే వివాహం చేసుకోబోతున్నారనే విధంగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో జోడో యాత్రలో ప్రణతి చెయ్యి పట్టుకొని మరి రాహుల్‌ తో కలిసి నడిచినట్లుగా కొన్ని వీడియోలు ఫోటోలు వైరల్ కావడంతో అప్పటినుంచి ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

Also Read: పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌…తప్పిన పెను ప్రమాదం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట.

New Update
kerala emp

kerala emp

సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట. దీనికి సంబంధించిన వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారం కావడంతో స్పందించిన కార్మిక శాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది.

Also Read: Iran: చరిత్రలో రికార్డ్ స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ విలువ.. డాలర్‌కు 10 లక్షల రియాల్స్‌..

ఓ సంస్థలో పని చేస్తున్న వ్యక్తి మెడకు బెల్టు కట్టి ఉండగా...అతడిని మరో వ్యక్తి మోకాళ్ల పై కుక్కలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మరికొందరు నాలుకతో నాణేలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ విషయమై కొందరు ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ...నిర్దేశించిన టార్గెట్‌ ను పూర్తి చేయని ఉద్యోగుల పై తమ సంస్థ ఈ విధమైన వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

Also Read: Local Body Elections : ఆ పదిస్థానాలకు ఎన్నికలు...మరో ఎన్నికలకు సై అంటోన్న రెండు పార్టీలు

పోలీసుల సమాచారం ప్రకారం..కలూరులోని ఓ ప్రైవేటు మార్కెటింగ్‌ సంస్థతో సంబంధం ఉన్నట్లు తెలిసిందన్నారు.ఘటన మాత్రం పెరుంబవూర్‌ బ్రాంచీలో జరిగినట్లు తెలుస్తోందన్నారు. అయితే యజమాని మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చినట్లు తెలిసింది.దీని పై ఉద్యోగులు ఇప్పటి వరకు ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సమాచారం.

ఈ అమానవీయ ఘటన పై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దృశ్యాలు షాక్‌ కు గురి చేశాయని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శివన్‌ కుట్టి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన వెల్లడించారు. ఈ ఘటన పైపూర్తి స్థాయి నివేదికను అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 

Also Read: TDP vs Jana Sena : పిఠాపురంలో రచ్చరచ్చ..రెండోరోజు నాగబాబుకు తప్పని నిరసన సెగ

Also Read: Tariffs Effect: ట్రంప్ సుంకాల దెబ్బ.. భారీగా పడిపోతున్న చమురు ధరలు

 kerala | employees | tortured | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment