BJP MP Raghunandan Rao: అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చారు: ఎంపీ రఘునందన్‌రావు

TG: డిసెంబర్‌ 9లోపు రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడని అన్నారు రఘునందన్ రావు. అందరికి ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని.. అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చారని అన్నారు.

New Update
BJP MP Raghunandan Rao: అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చారు: ఎంపీ రఘునందన్‌రావు

BJP MP Raghunandan Rao: రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని అన్నారు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు. డిసెంబర్‌ 9లోపు రుణమాఫీ చేస్తానని సీఎం అన్నారు.. పోయిందని చురకలు అంటించారు. ఇప్పుడు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామంటున్నారని అన్నారు. ఇప్పుడేమో కమిటీ వేసి ఎవరికి ఇవ్వాలో.. ఇవ్వకూడదో పరిశీలిస్తారంటా అని ఫైర్ అయ్యారు.

భూమి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి చాలా మాట్లాడారని.. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి వేధింపులతోనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు.. ఇవ్వట్లేదని ఆరోపించారు. అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చారని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు