Prudhvi Raj : వివేకా హత్య కేసుపై నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై సినీ నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డిని కాపాడేందుకే వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నిందితుడు దస్తగిరి వివేకాను దారుణంగా హత్య చేశామని చెబుతున్న కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 25 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Viveka Murder : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి(Avinash Reddy) ని కాపాడేందుకే వైసీపీ(YCP) ప్రభుత్వం పని చేస్తుందన్నారు సినీ నటుడు పృథ్వీరాజ్(Prudhvi Raj). తండ్రి మృతిపై సునీతమ్మ ఎంత పోరాటం చేస్తున్నా ఫలితం దక్కడం లేదన్నారు. సొంత చెల్లెలకు న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అనకాపల్లిలో సీఎం రమేష్ కార్యాలయంలో పృథ్వి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. Also Read: జగన్ పై నందమూరి బాలకృష్ణ పంచ్ డైలాగులు..! నిందితుడు దస్తగిరి వివేకాను అతి దారుణంగా హత్య చేశామని చెబుతున్న కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లో రెడ్డి రాజ్యాంగం అమలవుతుందన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ప్రజలు ఆనారోగ్యం పాలవుతున్నారన్నారు. ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు. కడపలో వైసీపీ ఓట్లన్ని చెల్లి షర్మిలకు వెళ్తాయని పేర్కొన్నారు. #ap-ycp #prudhvi-raj #viveka-murder సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి