Prudhvi Raj: వారం రోజుల్లో తట్టాబుట్టా సర్దుకోండి .. పృథ్వీ రాజ్ మాస్ వార్నింగ్..!

ఏపీలో జగన్మోహన్ రెడ్డికి కాలం చెల్లిందన్నారు జనసేన నేత, సినీ నటుడు పృథ్వీ రాజ్. ఏపీలో దరిద్రపు పాలన నడుస్తోందన్నారు. వారం రోజుల్లో వైసీపీ తట్టాబుట్టా సర్దుకోవడమేనని కౌంటర్ వేశారు. జగన్ రెడ్డి, ఆయన సైన్యం దోచుకో దాచుకో రీతిలో ఏపీని ఖాళీ చేశారని విమర్శలు గుప్పించారు.

New Update
Prudhvi Raj: వారం రోజుల్లో తట్టాబుట్టా సర్దుకోండి .. పృథ్వీ రాజ్ మాస్ వార్నింగ్..!

Janasena Leader Prudhvi Raj: తిరుపతిలో జనసేన నేత, సినీ నటుడు పృథ్వీ రాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో దరిద్రపు పాలన సాగుతుందన్నారు. బటన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కాలం చెల్లిందని..వారం రోజుల్లో తట్టాబుట్టా సర్దుకోవడమేనని కౌంటర్లు వేశారు. జగన్ రెడ్డి, ఆయన సైన్యం దోచుకో దాచుకో రీతిలో ఏపీని ఖాళీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: అలా అనడానికి సిగ్గులేదా.. పవన్ పై రెచ్చిపోయిన ముద్రగడ..!

సాక్షిలో పని చేసే సజ్జలకు కోట్లు రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తిరుపతిలో అభివృద్ధి పేరుతో దోపిడి చేశారని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవాభావంతో తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అన్నదమ్ముల్లా సమిష్టిగా పనిచేస్తున్నారన్నారు. ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు