Pulses Price: కిలో కందిపప్పు 200...మినపప్పు..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల రేట్లు ఆకాశనంటుతున్నాయి. వీటికి పప్పులు ధరలు తోడుగా వచ్చాయి.రిటైల్​ మార్కెట్​లో కిలో కంది పప్పు ధర నెల క్రితం రూ. 150 నుంచి రూ.160 ఉండగా..ప్రస్తుతం రూ.180 నుంచి రూ. 200 ధర ఉంది.సూపర్ మార్కెట్లలో కిలో రూ. 220కు అమ్ముతున్నారు.

New Update
Pulses Price: కిలో కందిపప్పు 200...మినపప్పు..?

Pulses Price: ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల రేట్లు ఆకాశానంటుతున్నాయి. వీటికి పప్పులు ధరలు కూడా తోడుగా వచ్చాయి. దీంతో సామాన్యుడికి పప్పన్నం అందనంత దూరం వెళ్లేట్లు కనిపిస్తుంది. రిటైల్​ మార్కెట్​లో కిలో కంది పప్పు ధర నెల రోజుల క్రితం రూ. 150 నుంచి రూ.160 ఉండగా..ప్రస్తుతం రూ.180 నుంచి రూ. 200 ధర ఉంది.

ఇక సూపర్ మార్కెట్లలో అయితే కిలో రూ. 220కు అమ్ముతున్నారు. అలాగే, మినపప్పు ధరలు కిలో నెల క్రితం రూ. 90 నుంచి రూ. 120 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ. 140 నుంచి రూ.160 వరకు ధర పలుకుతోంది. పెసర పప్పు ధర కిలో రూ. 80 నుంచి రూ. 100 ఉండగా.. ప్రస్తుతం రూ. 110 నుంచి రూ.120కి చేరింది.

అలాగే, శనగ పప్పు కిలో ధర రూ. 90 పలుకుతోంది. ఈ సారి రాష్ట్రంలో పప్పుధాన్యాల పంటల ఉత్పత్తి తక్కువగా ఉండడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మరో ఆరు నెలలపాటు కొత్త పంట చేతికి వచ్చే వరకూ ధరలు తగ్గే అవకాశం ఉండదని అంటున్నారు.

Also read: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ పై కాల్పులు.. !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే ఈ చర్య తీసుకున్నారని చెప్పారు. 

author-image
By Manogna alamuru
New Update
MLC Duvvada : భార్యపై ఎమ్మెల్సీ దువ్వాడ కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ దువ్వాడపై మొత్తానికి వేటు పడింది. గత కొన్ని రోజలుగా వార్తల్లో నిలుస్తున్న దువ్వాడ శ్రీనివాస్ పై ఎట్టకేలకు వైసీపీ అధ్యక్షుడు జగన్ చర్యలు తీసుకున్నారు. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పినట్లు ఫిర్యాదులు రావడం వలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ కొద్దిసేపటి క్రితం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 

జగన్ చెప్పిన మాట వినకపోవడం వల్లనే..

పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పిన మాట వినకపోవడం వల్లనే దువ్వాడను సస్పండ్ చేశారని తెలుస్తోంది. సుదీర్ఘ కాలం తర్వాత జగన్ ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. ఈ క్రమంలో టెక్కలి వైసీపీ ఇన్ ఛార్జి పేరాడ తిలక్ కి మద్దతు తెలపమని జగన్ అడిగారు. కానీ దీనికి దువ్వాడ ఒప్పుకోలేదు. దీంతో వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశించారని చెబుతున్నారు. నాయకుడు చెప్పిన వెంటనే సస్పెన్షన్ ను అమలు చేసింది పార్టీ కేంద్ర కమిటీ.  దీంతో ఇప్పటి వరకు జగనే నా దేవుడు అన్న దువ్వాడ దారెటో అని పార్టీ జనాలు అనుకుంటున్నారు. ఇతని సస్పెన్షన్ తో టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. కుటుంబ కలహాలే దువ్వాడకు శాపంగా పరిణించాయని..ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో వాణి హాస్తం వుందని మాట్లాడుకుంటున్నారు. 

 

ap
Mlc Duvvada suspention

 

 

 today-latest-news-in-telugu | duvvada-srinivas | ycp | suspend

Also Read: J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

 

Advertisment
Advertisment
Advertisment