Bharat Ratna: పీవీకి భారత్ రత్న... అందుకున్నది ఎవరో తెలుసా

ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో భార‌త‌ర‌త్న అవార్డుల ప్ర‌దాన కార్య‌క్ర‌మం జ‌రిగింది. పీవీ న‌ర‌సింహారావు తరఫున ఆయ‌న కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు.. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.

New Update
Bharat Ratna: పీవీకి భారత్ రత్న... అందుకున్నది ఎవరో తెలుసా

PV Narasimha Rao : ఢిల్లీ(Delhi) లోని రాష్ట్రపతి భవన్‌(Rashtrapati Bhavan)  లో శనివారం భారతరత్న(Bharat Ratna) అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించగా... వారికి రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము అవార్డులను అందించారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు(PV Narasimha Rao) తరుఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌ రావు ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు.

Bharat Ratna Awards

కర్పూరీ ఠాకూర్‌ తరుఫున ఆయన కుమారుడు రామ్‌ నాథ్‌, చౌదరీ చరణ్‌ సింగ్‌ తరఫున ఆయన మనవుడు జయంత్‌ సింగ్‌, స్వామినాథన్ తరుఫున ఆయన కుమార్తె నిత్యా రావు ఈ అవార్డులను అందుకున్నారు.

Rashtrapati Bhavan

ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌ షా(Amit Shah), బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఆద్వానీ కి ఆయన ఇంటికి వెళ్లి అవార్డును అందజేస్తారు.

Bharat Ratna Awards 2024

Also Read : టీడీపీకి బత్యాల గుడ్‌ బై…టికెట్‌ రాకపోవడంతో నిర్ణయం!

Advertisment
Advertisment
తాజా కథనాలు