JOBS: పోస్టల్ శాఖలో కొలువుల జాతర.. పదోతరగతి అర్హతతో 44,228 ఉద్యోగాలు! పదో తరగతి అర్హతతో పరీక్ష లేకుండానే పోస్టల్ శాఖ 44,228 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. జులై 15 నుంచి ఆగస్టు 5వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అప్లికేషన్ లింక్ https://indiapostgdsonline.gov.in/ By srinivas 15 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Indian Post: నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్ భారీ శుభవార్త చెప్పింది. పదో తరగతి అర్హతతో ఎలాంటి పరీక్ష లేకుండానే దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. జులై 15 నుంచి ఆగస్టు 5వరకు ఆన్లైన్లో https://indiapostgdsonline.gov.in/ దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అలాగే ఆగస్టు 6 నుంచి 8వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. పదో తరగతి మార్కుల ఆధారంగా.. ఈ మేరకు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్టు అధికారులు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/ డాక్సేవక్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం రావాలి. ఆ ఉద్యోగాలను బట్టి బీపీఎంకు వేతన శ్రేణి రూ.12 వేలు -రూ.29,380; ఏబీపీఎం/డాక్ సేవక్కు రూ.10వేలు -24,470గా నిర్ణయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున గరిష్ఠ వయసులో సడలింపు ఉంది. ఏపీలో 1355, తెలంగాణలో 981 చొప్పున భర్తీ చేయనున్నారు. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు(IPPB)కు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్లకు ప్రోత్సాహకాలు ఇస్తారు. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. #44 #indian-post #228-jobs-notification సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి