AP: టీడీపీ దాడి కేసు.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాడి సమయంలో ఎక్కడ ఉన్నారనే విషయాలపై మంగళగిరిలో ఉన్న గ్రామీణ పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్నారు.

New Update
AP POLICE

AP: గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు చంద్రబాబు నివాసంపై దాడులు జరిగాయి. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిన చెల్లుతుందనే ఉద్దేశంతో వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కేసును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది కూడా చూడండి:  Stock Markets: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముగ్గురు నేతలను..

ఈ దాడి కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మంగళగిరిలో ఉన్న గ్రామీణ పోలీసు స్టేషన్‌లో ఈ ముగ్గురు వైసీపీ నేతలను పోలీసులు విచారిస్తున్నారు. దాడులు జరిగిన రోజు వీరు ముగ్గురు ఎక్కడ ఉన్నారు? ఎవరిని కలిశారు? ఎక్కడెక్కడ కలిశారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. 

ఇది కూడా చూడండి:  Muthyalamma : అమ్మవారి విగ్రహం ధ్వంసం.. ఆలయం వద్ద పెరిగిన ఉద్రిక్తత

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2021 అక్టోబర్‌ 19న ఆ పార్టీకి చెందిన నాయకులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు అయిన దేవినేని అవినాష్‌, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మరో 14 మంది దాడి చేశారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరంతా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు.

ఇది కూడా చూడండి: Ap Crime: అత్తా కోడళ్ల అత్యాచారం కేసు..ఇద్దరు నిందితుల అరెస్ట్‌!

ముందస్తు బెయిల్‌ ఇవ్వడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ దాడుల వెనుక గత ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణ రెడ్డి హస్తం కూడా ఉందనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. ఇతన్ని కూడా విచారణ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే కేసు వేగవంతం అయితే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

ఇది కూడా చూడండి:  Ap Rains : ఏపీలో అలర్ట్.. ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: ముమ్మాటికి భద్రతా లోపమే.. అమిత్ షా, మోదీ రాజీనామా చేయాలి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

ఉగ్రదాడి ముమ్మాటికి భద్రత లోపమేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఫైర్ అయ్యారు. ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
 ys sharmila

ys sharmila

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి మనం దేశం మీద జరిగిన దాడి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిల అన్నారు. దేశంలో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని  ప్రధాని మోడీ ఒక క్యాంపెయిన్ నడిపారని.. పెద్ద పెద్ద బోర్డులు పెట్టారని అన్నారు. ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కశ్మీర్ కి వెళ్తుంటారన్నారు. ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకు? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి భద్రత లోపమేనని ధ్వజమెత్తారు. టూరిస్టులపై కాల్పులు జరుపుతుంటే ఆర్మీ వాళ్లు లేనే లేరన్నారు. ప్రొటెక్షన్ కోసం ఉండే సెక్యూరిటీ కూడా లేదన్నారు. ఇంతమంది చనిపోయారు అంటే ప్రభుత్వ లోపమేనన్నారు. ఉగ్రవాదం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని అన్నారు. నేడు దేశ నిఘా వ్యవస్థ దేశం కోసం పనిచేయడం లేదన్నారు. ఇండియా ఇంటలిజెన్స్ అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ల మీద పనిచేస్తోందని ఆరోపించారు. 

మోదీకి అధికారంలో ఉండే హక్కు లేదు..

ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లకు అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. వీళ్ళు దేశానికి చౌకిదార్ కాదు..బీజేపీకి చౌకిదార్లని అన్నారు. ఈ దేశ దర్యాప్తు వ్యవస్థలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్నారు. నిఘా వ్యవస్థ బలం అంతా ప్రధాని మోదీ కోసం పని చేస్తోందన్నారు. దేశ భద్రతను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికి కేంద్రం తప్పిదమేనని ఫైర్ అయ్యారు. ఈ ఘటనలో ఒక ముస్లిం కూడా చనిపోయారని.. దేశంలో ఉన్న ముస్లింలను చెడ్డవాళ్ళు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో మతం పేరుతో యుద్ధం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ దేశంలోనే ఇంటర్నల్‌గా భద్రత లేదన్నారు. అన్ని మతాలు సమానం అనే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. మోదీ శ్రమ దేశ భద్రత కోసం పెట్టి ఉంటే బయట వాళ్ళు చొరబడే పరిస్థితి లేదన్నారు.

Advertisment
Advertisment
Advertisment