Ananthapuram: అనంతపురంలో ఏ.ఆర్ ఎస్సై నిర్వాకం.. 15 ఏళ్ళు ఓ మహిళతో సహజీవనం చేసి...

అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట ఓ మహిళ తన కొడుకుతో ఆందోళనకు దిగింది. ఏ.ఆర్ ఎస్సైగా పనిచేస్తున్న చంద్రశేఖర్ 15 ఏళ్లుగా తనతో సహజీవనం చేశాడని ఆరోపిస్తుంది. అయితే తనకు ఇప్పుడు సంబంధం లేదని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది.

New Update
Ananthapuram: అనంతపురంలో ఏ.ఆర్ ఎస్సై నిర్వాకం.. 15 ఏళ్ళు  ఓ మహిళతో సహజీవనం చేసి...

Ananthapuram: అతడు చేసేది పోలీస్‌ ఉద్యోగం. ఎవరైన తప్పు చేస్తే వారికి బుద్ధి చెప్పడం అతడి పని. కానీ ఇది తప్పు అని చెప్పాల్సిన అతడే  .. తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. 15 ఏళ్లగా ఓ మహిళతో సహజీవనం చేసి కొడుకు పుట్టాక ఇప్పుడు సంబంధం లేదని మోసం చేశాడు. ఈ  ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. బాధిత మహిళ తన 15 ఏళ్ళు కొడుకుతో కలిసి అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది.

Also Read: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్రా పోలీసులు

అనంతపురం నగరంలో ఏ.ఆర్ ఎస్సైగా పనిచేస్తున్న చంద్రశేఖర్ తనను మోసం చేశాడని.. అంజలి అనే మహిళ  ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది. పదహారేళ్ల కిందట తన భర్త ఇమామ్ సాబ్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఏ.ఆర్ ఎస్ఐ చంద్రశేఖర్ పరిచయం అయ్యారని చెప్పింది. తన భర్త ఇమామ్ సాబ్ పీటీసీకి శిక్షణ కోసం వచ్చినప్పుడు ఫెయిల్ చేస్తానని బెదిరించి తనను లొంగదీసుకున్నాడని బాధితురాలు తెలిపారు.

Also Read: భార్యకు గుండు గిసి చిత్రహింసలు పెట్టిన భర్త..!

అప్పటి నుంచి నిత్యం తన ఇంటికి వస్తుండేవాడని బాధితురాలు చెప్పారు. ఈ విషయం తెలిసిన తన భర్త.. తన నుంచి దూరమయ్యాడని బాధితురాలు పేర్కొంది. 15 ఏళ్లు సహజీవనం చేసి ఇప్పుడు సంబంధం లేదని తనను బెదిరిస్తున్నాడని బాధితురాలు కన్నీరు మున్నీరయ్యారు. తన భర్తను స్లో పాయిజన్ పెట్టి చంపినట్లే తమను చంపుతానని ఏఆర్ ఎస్ఐ చంద్రశేఖర్ బెదిరిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయింది. తనకు న్యాయం చేయాలని తన కుమారుడితో కలిసి బాధితరాలు అంజలి కోరింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు