AP: పోలవరం టికెట్ రగడ.. అనపర్తి సీటుపై ఉత్కంఠ..!

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. పోలవరం టికెట్ జనసేనకు కేటాయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో అనపర్తి సీటుపై ఉత్కంఠ కొనసాగుతుంది.

New Update
AP: పోలవరం టికెట్ రగడ.. అనపర్తి సీటుపై ఉత్కంఠ..!

TDP Leaders Protest: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ప్రియాంక కన్వెన్షన్ లో టీడీపీ నేతలతో చంద్రబాబు (Chandrababu) సమావేశం ఏర్పాటు చేశారు. అయితే,  మీడియా సమావేశానికి ముందు చంద్రబాబు ఉన్న కన్వెన్షన్ వద్ద పోలవరం టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. పోలవరం టికెట్ (Polavaram MLA Seat) జనసేనకు కేటాయించడం పట్ల టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం టికెట్ టీడీపీ ఇంచార్జి బొరగం శ్రీనివాస్ కే ఇవ్వాలంటూ నినాదాలు చేపట్టారు. చంద్రబాబు బస చేస్తున్న కన్వెన్షన్ వద్దే తెలుగుతమ్ముళ్లు నిరసనకు దిగారు. అయితే, ఇటీవలే పోలవరం కూటమి అభ్యర్థిగా అధిష్టానం జనసేన (Janasena) నుంచి చిర్రి బాలరాజు పేరు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read: టీడీపీలో చల్లారని అసమ్మతి.. బలప్రదర్శనకు దిగిన బత్యాల..!

తాజాగా, నల్లజర్లలో రాజమండ్రి పార్లమెంటరీ నేతలతో చంద్రబాబు సమావేశమైయ్యారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సైతం ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు. చంద్రబాబుతో బేటీ అయ్యారు. ఈ క్రమంలో అనపర్తి సీటుపై చంద్రబాబు ముందు రామకృష్ణారెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో, అధైర్య పడవద్దని  ధైర్యం చెప్పి ..తనకు సానుకూల ప్రకటన వస్తుందని నల్లమిల్లికి చంద్రబాబు హామీ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: పేర్ని నాని బీ కేర్ ఫుల్.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి వార్నింగ్..!

ఈ నేపథ్యంలో అనపర్తి సీటు గందరగోళంపై నేడు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతుంది. రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి రావాలని పార్టీ పెద్దలు అహ్వానించినట్లు సమాచారం. టీడీపీలో తప్ప ఏపార్టీలోకి రానని బీజేపీ నాయకులతో తెల్చి చెప్పినట్లు తెలుస్తోంది. నల్లమిల్లి చంద్రబాబుని కలవడంపై నియోజకవర్గంలో అనపర్తి సీటుపై ఉత్కంఠ కొనసాగుతుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపునకు తుది గడువు ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  

New Update
Inter Supplementary Exams

Inter Supplementary Exams

Inter Supplementary Exams:  ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. కాగా ఇంటర్‌ ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత సాధించింది. గతం కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ఆధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  


 Also Read :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
 
మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా ఫేయిలై విద్యార్థులు సబ్జెక్టులను బట్టి  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి.  

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!


ఈరోజు (శనివారం) ఉదయం సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్  ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి అత్యధికంగా పాస్‌ పర్సంటేజ్ నమోదు అవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ప్రతీఏడు లాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికదే పై చేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 71 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 64 శాతం ఉత్తీర్ణత పొందారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో బాలికలు ఉత్తీర్ణత పొందగా.. బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read :  అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో

Advertisment
Advertisment
Advertisment