Lok Sabha Elections 2024 : ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’..ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు 24 భాషల్లో ప్రచార గీతం..!!

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఆపార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా 2024లోకసభ ఎన్నికలకు బీజేపీ కసరత్తు షురూ చేసింది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రచారం కోసం బీజేపీ 24భాషల్లో ప్రచార గీతాన్ని విడుదల చేసింది.

New Update
Lok Sabha Elections 2024 : ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’..ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు 24 భాషల్లో ప్రచార గీతం..!!

Lok Sabha Elections 2024 : ‘ భారత్ మండపంలో జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో రానున్న లోకసభ ఎన్నికలకు ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ పేరుతో రూపొందించిన ప్రచారగీతాన్ని విడుదలచేశారు. సమ్మళిత అభివృద్ధి థీమ్ రూపొందించిన ఈ పాటను కేవలం హిందీలోనే కాకుండా దేశవ్యాప్తంగా 24 భాషల్లో రిలీజ్ చేశారు. ఈ పాటలో ఎన్డీయే సర్కార్ తీసుకువచ్చిన పథకాలు, అంతర్జాతీయంగా భారత్ సాధించిన ఘనతలతోపాటు దేశంలోని పలు రంగాల్లో, ప్రాంతాల్లో, పలు సమూహాల్లో, సమాజంలోని వర్గాల్లో డెవలప్ మెంట్ ను హైలెట్ చేశారు.

రైతులు, అసంఘటిత కార్మికులు, మహిళలు, యువత కోసం మోదీ సర్కార్ కృషి, దేశంలో అపూర్వమైన మౌలిక సదుపాయాలను ఆర్ధిక, చంద్రయాన్ 3, రామమందిర నిర్మాణం వంటి అసమానమైన విజయాలను కూడా ఈ పాటలో ప్రస్తావించారు. ఈ ఎన్నికల సందర్భంగా www.ekbaarphirsemodisarkar.bjp.org వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. దీనిలో ఇప్పటికే 30లక్షల మందికిపైగా పౌరులు రాబోయే ఎన్నికల్లో మోదీ, బీజేపీకి ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఇది కూడా చదవండి: చెరుకు రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ ..కొనుగోలు ధరలు పెంపు..కొత్త ధరలు ఇవే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు