Paris Olympics: చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్..మనికా బత్రా!
భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్రా పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ లో రౌండ్ 16 కు అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా 29 ఏళ్ల మనికా రికార్డును నెలకొల్పింది.
Paris Olympics: భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్రా పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ లో రౌండ్ 16 కు అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా 29 ఏళ్ల మనికా రికార్డును నెలకొల్పింది. రౌండ్ 32లో భాగంగా ఫ్రాన్స్ కు చెందిన ప్రపంచ 18 వ ర్యాంక్ క్రీడాకారిణి ప్రితికా పవడేతో సోమవారం జరిగిన మ్యాచ్ లో 11-9, 11-6, 11-9, 11-7 తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది.
ఆటలో తొలి సెట్ నుంచే విశ్వరూపం చూపించిన మనికా ఏ సెట్ లో కూడా ప్రితికా కు అవకాశమే ఇవ్వలేదు. తొలి సెట్ లో కొంచెం గట్టి పోటీని ఇచ్చినప్పటికీ పెద్దగా తన ప్రతిభను చూపించలేకపోయింది. మనికా అద్భుత ప్రదర్శనతో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా 4-0 తేడాతో ప్రితికాను ఓడిచింది.
మనికా ప్రస్తుతం ప్రపంచ 28 వ ర్యాంకులో ఉండగా..ప్రీ క్వారర్ట్ ఫైనల్ లో ఎనిమిదో సీడ్ మియూ హిరానో (జపాన్) జు చెంగ్జూ (హాంకాంగ్ ) తో తలపడనున్నట్లు సమాచారం.
🔴Live News Updates: వివాదంలో హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Hyderabad Metro: వివాదంలో హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం
హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో హెచ్ఎంఆర్ఎల్ ఎండీకి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు సంబంధించిన వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
Hyderabad metro
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్.. వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ మెట్లో రై ళ్లలో యథేచ్ఛగా జరుగుతున్న బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు సంబంధించిన సమగ్ర వివరాలతో కౌంటర్ అఫిడవిట్ను తక్షణమే దాఖలు చేయాలని ఆదేశించింది.
మెట్రో రైళ్లలో చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ.. హైకోర్టులో అడ్వకేట్ నాగూర్ బాబు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైలులో నిబంధనలను ఖతారు చేయకుండా అధికారులు ఎలా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు అనుమతులు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది యువతను తప్పుదారిలోకి మళ్లించే ప్రమాదం ఉందని అన్నారు.
మరోవైపు.. తెలంగాణ గేమింగ్ యాక్ట్ 2017 స్పష్టంగా అమల్లో ఉన్నప్పటికీ, HMRL తో పాటు దాని అనుబంధ సంస్థలు కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడానికి భారీగా ముడుపులు అందుకున్నారని పిటిషన్లో ఆరోపించారు. ఈ అక్రమ లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేత సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ కుంభకోణంలో ఎంత మంది అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు లాభం పొందారో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ పిటిషన్పై గురువారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కీలక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న అనంతరం, ప్రతివాదులైన HMRL ఎండీకి నోటీసులు జారీ చేశారు. పూర్తి ఆధారాలు, వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. దీంతో ఈ కేసులో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నట్లు న్యాయ నిపుణులు అంటున్నారు. హైకోర్టు ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఒకవేళ ఇది HMRL నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తప్పకపోవచ్చని తెలుస్తోంది.
RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ
మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది.
RCB VS RR
Apr 25, 2025 06:50 IST
Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?
కాశ్మీర్ ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.అపార నష్టంతో కుమిలిపోతున్న మనం రగిలిపోతుంటే..పాకిస్తాన్ మాత్రం పొగరుతో కాలు దువ్వుతోంది. యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే గెలుపెవరిది?ఎవరి బలం ఎంతుంది?
Indian Army
Apr 25, 2025 06:50 IST
Air india: పహల్గాం ఉగ్రదాడి... కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్ ఇండియా!
టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది.భారత్కు చెందిన విమానాలకు పాక్ తమ గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక పై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు వెల్లడించింది.