Parenting Guide: మీ పిల్లలకు చదువు పై ఇంట్రెస్ట్ లేదా..? వెంటనే ఈ బ్రెయిన్ గేమ్స్ అలవాటు చేయండి..!

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. చదువు పై పిల్లల ఏకాగ్రతను పెంచడానికి ఈ 5 రకాల బ్రెయిన్ గేమ్స్ ఉత్తమైన మార్గం. సుడోకు, చెస్, పజిల్, యోగా. ఇవి జ్ఞాపకశక్తి, లాజిక్ సెన్స్ మెరుగుపరచడంలో సహాయపడతాయి.

New Update
Parenting Guide: మీ పిల్లలకు చదువు పై ఇంట్రెస్ట్ లేదా..? వెంటనే ఈ బ్రెయిన్ గేమ్స్ అలవాటు చేయండి..!

Parenting Guide: పిల్లల బ్రెయిన్ చాలా పదునైనది. చిన్నతనంలో పిల్లలు విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు. అయితే కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అటువంటి పిల్లల్లో ఏకాగ్రత స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువ సేపు చదవలేకపోవడం, అర్ధం చేసుకోలేకపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఇటువంటి పిల్లల్లో ఏకాగ్రతను పెంచడానికి బ్రెయిన్ గేమ్స్ అలవాటు చేయడం ఉత్తమమైన మార్గం అని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

పిల్లల ఏకాగ్రతను పెంచే ఆటలు 

సుడోకు

పిల్లల బ్రెయిన్ కు పదునుపెట్టి, చదువుపై దృష్టి పెట్టడానికి ప్రతిరోజూ కొంత సమయం పాటు సుడోకు ఆడటం నేర్పండి. సుడోకు ఏకాగ్రతను పెంచడానికి ఉత్తమమైన గేమ్. దాని సహాయంతో, పిల్లలలో లాజిక్ సెన్స్, ఫోకస్ అభివృద్ధి చెందుతాయి. గణిత నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి.

చెస్

చదరంగాన్ని ఫోకస్, ఏకాగ్రతతో కూడిన ఆట అంటారు. ప్రతిరోజూ మీ పిల్లలతో చెస్ ఆడటం అలవాటు చేసుకోండి. పిల్లవాడు రోజూ ఒక గంట పాటు కూర్చుని చదరంగం ఆడడం ద్వారా చదువు పై ఏకాగ్రత పెరగడానికి సహాయపడుతుంది. ఈ గేమ్ పిల్లల జ్ఞాపకశక్తి, లాజిక్ సెన్స్, గణితాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

పజిల్

పజిల్ఇది ఒక బ్రెయిన్ గేమ్. ఈ ఆట ఆడటం వల్ల పిల్లల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లవాడు చాలా లాజిక్‌లను కూడా వర్తింపజేస్తాడు. తద్వారా చదువులో కూడా ప్రతిభను కనబరుస్తారు. పిల్లలు ఆటలు ఆడటానికి ప్రోత్సహించండి. అప్పుడే పిల్లల మైండ్ షార్ప్ అవుతుంది.

యోగా

పిల్లలతో కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు కూడా చేయించండి. తద్వారా పిల్లల మెదడు అభివృద్ధి చెందుతుంది. ప్రతిరోజూ వృక్షాసనం, బాలాసనం, తడసానా వంటి యోగా భంగిమలను చేయించండి. ఇవి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి.

Also Read: Kalki 2898AD: 'కల్కి'కి జాక్ పాట్.. ఓటీటీ రైట్స్ కోసం రెండు దిగ్గజ ప్లాట్ ఫార్మ్స్ బరిలో ...! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Omar Abdullah: పాక్‌ ప్రధానిపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధానిపై జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శించారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. '' పహల్గాంలో చోటుచేసుకున్న దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదు.

Also read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఈ ఘటన వెనుక భారత్ ఉందని వాళ్లే మొదటగా ఆరోపించారు. మనపై ఎప్పుడూ ఆరోపణలు చేసేందుకు ముందుండే వాళ్లకు ఇప్పుడు మనమేమి చెప్పలేం. వాళ్లు చేసిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదని'' సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడాన్ని ఆయన ఖండించారు.  

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

ఇదిలాఉండగా.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్‌ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్‌ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. యూరీ దాడి తర్వాత 89లో భారత్‌ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్‌ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్‌ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు.

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

telugu-news | rtv-news | national-news | Omar Abdullah 

Advertisment
Advertisment
Advertisment