IND Vs PAK: భారత్‌తో మ్యాచ్‌కు ఓరోజు ముందుగానే జట్టును ప్రకటించిన పాకిస్తాన్

యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ శనివారం జరగనుంది. ఆసియాకప్‌లో భాగంగా పల్లెకెలె వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఓ రోజు ముందుగానే తుది జట్టును ప్రకటించడం విశేషం.

New Update
IND Vs PAK: భారత్‌తో మ్యాచ్‌కు ఓరోజు ముందుగానే జట్టును ప్రకటించిన పాకిస్తాన్

యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ శనివారం జరగనుంది. ఆసియాకప్‌లో భాగంగా పల్లెకెలె వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఓ రోజు ముందుగానే తుది జట్టును ప్రకటించడం విశేషం. పాక్ పేస్ బౌలర్ షహీన్ ఆఫ్రిది ఫిట్‌గా ఉండటంతో జట్టులో చోటు కల్పించింది. ఇక పూర్తి స్థాయి జట్టుతోనే ఈ మ్యాచ్‌లో బరిలో దిగనుంది.

పాక్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అఘా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, షహీన్ షా ఆఫ్రిది

అయితే రేపటి మ్యాచ్‌కూ వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. గూగుల్‌ వెదర్ ప్రకారం, రోజంతా బలమైన క్లౌడ్ కండిషన్స్‌ ఉన్నాయి. గేమ్ సమయంలో 56శాతం నుంచి 78శాతం వరకు వర్షం పడే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభ దశలో(3:00 PM IST) ఉష్ణోగ్రత 92శాతం తేమతో దాదాపు 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. మరో వాతావరణ నివేదిక (MET) ప్రకారం ఆటకు ఒక గంట ముందు 68శాతం వర్షం పడే అవకావం ఉందని అంచనా వేసింది. కాబట్టి.. రెండు జట్లు తడి అవుట్‌ఫీల్డ్(Wet outfield)‌లో ఆడటానికి అవకాశం ఉంది.

ఆగస్ట్ 31(నిన్న)న పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌-శ్రీలంక మ్యాచ్‌ సమయంలో కూడా వర్షం పడింది. గేమ్‌ మధ్యలో వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ మొదటి అర్ధభాగంలో తేలికపాటి జల్లులు కురిశాయి. ఇది కొన్ని నిమిషాల పాటు ఆటను నిలిపివేసింది. పల్లెకెలేలోనే ఇండియా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. టీమిండియా ఆడనున్న రెండు గ్రూప్‌ మ్యాచ్‌లకు పల్లెకెలే ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్‌ 2(రేపు) పాక్‌తో మ్యాచ్‌తో పాటు సెప్టెంబర్‌ 4న నేపాల్‌తో మ్యాచ్‌ ఆడనుంది. అటు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం ఫైనల్‌తో సహా ఆరు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. ఇక్కడ కూడా రెయిన్‌ ఎఫెక్ట్ ఉంది. ఈ లెక్క చూస్తే ఆసియా కప్ మ్యాచ్‌లలో ఎక్కువ భాగం మ్యాచ్‌లు అభిమానులు వర్షం అంతరాయాలతోనే చూడాల్సి ఉంటుంది. ఇక రేపటి ఇండియా-పాక్‌ మ్యాచ్‌కు స్టేడియం ఇప్పటికే హౌస్‌ఫుల్‌ అయ్యింది.

ఇక నేపాల్‌పై భారీ విజయంతో పాకిస్థాన్ ఆసియా కప్‌ టోర్నీని ఆరంభించింది. కప్‌లో టోర్నిలో మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో చిత్తు చేసింది. భారత్‌తో రేపు(సెప్టెంబర్‌ 2) జరిగే మ్యాచ్‌ రద్దయితే.. పాక్ జట్టు సూపర్ 4లో ఎంట్రీ ఇస్తుంది. ఇక టీమిండియా నేపాల్‌పై విజయం సాధిస్తే భారత్ కూడా సూపర్4 కు చేరుకుంటుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు