Orange Peel Benefits : ఏంటీ.. నారింజ తొక్కలను పడేస్తున్నారా..? అయితే మీ అందం గురించి మర్చిపోండి

ఆరెంజ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. సాధారణంగా అందరు ఈ పండు తిని తొక్క పడేస్తారు. కానీ పండు మాత్రమే దీని తొక్కతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నారింజ తొక్కలతో తయారు చేసిన పేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో తెలియాలంటే హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Orange Peel Benefits : ఏంటీ.. నారింజ తొక్కలను పడేస్తున్నారా..? అయితే మీ అందం గురించి మర్చిపోండి

Benefits Of Orange Peel : నారింజ లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. రోజూ తినే ఆహారంలో వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను(Health Benefits) అందిస్తుంది. వీటిలో విటమిన్ C(Vitamin C) ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు, ఇతర వ్యాధుల దరి చేరకుండ పోరాడుతుంది. అలాగే నారింజలో ఫైబర్ గుణాలు శరీరంలో చక్కర స్థాయిలు నియంత్రించును. అంతే కాదు అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్(Cholesterol Levels) ను తగ్గించి గుండె సంబంధిత వ్యాధుల(Heart Diseases) నుంచి కాపాడును. అయితే ఈ పండు మాత్రమే కాదు దీని తొక్కతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
దీనిలోని విటమిన్ సి చర్మ సౌందర్యానికి చాలా ముఖ్యం. మరి అందాన్ని పెంచడానికి ఈ తొక్కను ఎలా వాడాలో చూసేయండి..

ముఖ సౌందర్యాన్ని  పెంచడానికి  నారింజ తొక్కలను వాడే విధానం 

నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్

నారింజ తొక్కలు(Orange Peel) ఎండిన తర్వాత వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిలో 1 టీ స్పూన్ తేనే, కాసింత పసుపు, కలిపి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను ముఖానికి, మెడకు అప్లై చేసి.. 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత మొహాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆరెంజ్ లోని విటమిన్ సి, ఇతర పోషకాలు చర్మంలోని మృతకణాలను తొలగించి.. మొహాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఈ పీల్ ఆఫ్ మాస్క్ రోజ్ వాటర్, బియ్యం పిండితో కూడా కలిపి అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ గా ఇలా చేస్తే స్కిన్ పై మంచి ప్రభావం ఉంటుంది.

Also Read : Tea In Paper Cups : పేపర్ కప్పులో టీ తాగితే ఇంత ప్రమాదమా..! అస్సలు లైట్ తీసుకోకండి

Orange Peel

డ్రై స్కిన్ ఉన్నవారు ఇలా అప్లై చేయండి

డ్రై స్కిన్ ఉన్నవారికి ఆరెంజ్ పీల్ మాస్క్ మంచి హైడ్రేటింగ్ చిట్కాల పనిచేస్తుంది. నారింజ తొక్క పొడిలో 1 టీ స్పూన్ పాలు, 1 చెంచా కొబ్బరి నూనె కలిపి పేస్ట్ లా తయారు చేసి.. 15 నిమిషాల పాటు మొహానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని హైడ్రేటింగ్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

Also Read: Milk: పాలను వీటిలో కలిపి తాగితే.. ఎన్ని లభాలో తెలుసా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!

TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కల్పిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను ఇక్కడివిగా చిత్రీకరిస్తున్నారన్నారు.

New Update
TTD Cows Death

TTD Chairman Reaction Over Cows Death

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.

గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల  గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..

ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా  చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు. 

(br naidu ttd chairman | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment