NTR Devara: రిలీజ్ కు ముందే సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ 'దేవర'...!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం దేవర. విడుదలకు ముందే ఈ మూవీ సంచలనం సృష్టించింది. ఊహించని విధంగా 'దేవర' కోసం మేకర్స్ ఖర్చు చేసిన భారీ బడ్జెట్ మొత్తాన్ని రిలీజ్ కు ముందే రాబట్టినట్లు తెలుస్తోంది.

New Update
NTR Devara: రిలీజ్ కు ముందే సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ 'దేవర'...!

NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన కొమురం భీమ్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.. జాన్వీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5న వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడింది. 

కాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ పై మేకర్స్ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

రిలీజ్ కు ముందే 'దేవర' సంచలనం 

ఇది ఇలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 'దేవర' రిలీజ్ కు ముందే నిర్మాతలను లాభాల బాటలో పడేసినట్లు తెలుస్తుంది. తాజా కథనాల ప్రకారం ఊహించని విధంగా 'దేవర' చిత్రం కోసం మేకర్స్  చేసిన భారీ బడ్జెట్ మొత్తాన్ని రిలీజ్ ముందే ఈ మూవీ రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. విడుదలకు ముందు దేవర హవా ఇలా ఉందంటే.. ఇక రిలీజ్ తర్వాత రికార్డులు ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

'

Also Read: Sandeep Reddy Vanga: “మిమల్ని కాస్ట్ చేసినందుకు బాధపడుతున్నాను”.. బాలీవుడ్ నటుడి పై సందీప్ వంగా షాకింగ్ కామెంట్స్..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment