సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. ఆ రోజు పనిచేయకపోయిన వేతనాలు

సింగరేణి కార్మికులకు తమ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ కార్మికులకు సెలవు ప్రకటించింది. పోలింగ్ జరిగే నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. ఆ రోజు పనిచేయకపోయిన వేతనాలు

అంద‌రూ ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు వీలుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలు, గవర్నమెంట్ ఆఫీసులకు పోలింగ్ సందర్భంగా సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ నేప‌థ్యంలో కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేత‌నంతో కూడిన సెల‌వు ఇవ్వాల‌ని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా క‌ర్మాగారాలు, దుకాణాలు, ప‌రిశ్రమ‌ల్లో ప‌ని చేసే సిబ్బందికి వేత‌నంతో కూడిన సెల‌వు ఇవ్వాల‌ని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ కార్మిక శాఖ ఒక ప్రక‌ట‌న‌లో వెల్లడించింది.

అలాగూ పోలింగ్‌ పూర్తైన వెంటనే ఈవీఎంలను తీసుకొని ఆయా కేంద్రాలకు వెళ్లి సమర్పించి వచ్చే సరికి అర్ధరాత్రి దాటుతుందని, అందువల్ల విధుల్లో పాల్గొన్న వారికి డిసెంబరు 1వ తేదీ కూడా సెలవు ఇవ్వాలి అని రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎంఎస్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే ఈ విషయాలన్నింటిపై త్వరలో అధికారికంగా స్పష్టత రానుంది. అలాగే డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరిగే ఆయా కార్యాలయాలకు సెలవు ఉంటుందని సమాచారం.

Also read : SBIF Asha Scholarship కోసం అప్లై చేసుకున్నారా.. లాస్ట్ డేట్ ఇదే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 29, 30 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో చాలా వరకు పాఠశాల ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేస్తున్నందున స్కూళ్లకు సెలవు ప్రకటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్‌ జరగనున్నందున, ఆ రోజుతో పాటు ముందురోజు కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1.06 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. పోలింగ్‌ కేంద్రాలుగా ఉండే ప్రభుత్వ పాఠశాలలకు ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది ముందు రోజు మధ్యాహ్నమే చేరుకుంటారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు ఉపాధ్యాయులు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Allu Arjun- Atlee: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ హైప్ నెలకొంది. బన్నీ డ్యూయల్ రోల్, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఉండనున్నారని టాక్‌ ప్రచారంలో ఉంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది.

New Update
Allu Arjun – Atlee

Allu Arjun – Atlee Movie

Allu Arjun- Atlee : ఇటీవల టాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేసిన ఓ భారీ ప్రాజెక్ట్ ఏమిటంటే.. అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందనున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన నాటి నుంచి ఎన్నో ఆసక్తికర రూమర్స్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై, కొన్ని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారన్న టాక్ హీట్ పెంచింది. అంతేకాదు, ఈ చిత్రానికి గ్లోబల్ స్టాండర్డ్స్‌ను లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల, హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ టాప్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు తెరపైకి వచ్చింది. హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెను ఎంపిక చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

ఇప్పటికే ప్రియాంక చోప్రా, మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఇంటర్నేషనల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన కూడా ఆమె కనిపిస్తే, అది మరో క్రేజీ కాంబోగా మారనుంది. అయితే దీనిపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.

ఈ గ్రాండ్ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. బడ్జెట్ పరంగా, విజువల్ ట్రీట్ పరంగా ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో తెరకెక్కించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

మొత్తానికి అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్‌ను సృష్టించగా, కథ, తారాగణం, టెక్నికల్ టీమ్ డీటెయిల్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment