TG: పాముతో చెలగాటం.. ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి..! నిజామాబాద్ జిల్లా దేశాయిపేట్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్నేక్ క్యాచర్ మోచి శివరాజు అనే 18 ఏళ్ల యువకుడు పాముతో సెల్ఫీ తీసుకోబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏకంగా పామును నోట్లో పెట్టుకొని శివరాజు ఫొటోకు ఫోజులిచ్చాడు. అదికాస్తా కాటు వేయగా మృతి చెందాడు. By Jyoshna Sappogula 06 Sep 2024 in క్రైం నిజామాబాద్ New Update షేర్ చేయండి Nizamabad: పాముతో చెలగాటం ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు స్నేక్ క్యాచర్. ఈ విషాదకరమైన ఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో చోటుచేసుకుంది. పాములు పట్టే మోచి శివరాజు అనే 18ఏళ్ల యువకుడు పాము కాటుతో మృతి చెందాడు. Also Read: వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ శివరాజు తండ్రి మోచి గంగారం పాములు పట్టే వ్యక్తి. ఈ క్రమంలోనే ఆ విద్య తన కొడుకుకి కూడా నేర్పించాడు. ఈ నేపథ్యంలోనే తండ్రి గంగారం ఓ పామును పట్టి కొడుకును పట్టుకోమని ఇచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే, కొడుకు శివరాజ్ మాత్రం పాముతో సెల్ఫి కోసం ప్రయత్నించాడు. ఏకంగా పామును నోట్లో పెట్టుకొని ఫోటోకు, వీడియోలకు శివరాజు ఫోజులివ్వడం మొదలుపెట్టాడు. Also Read: ఐస్క్రీమ్లో విస్కీ కలకలం.. హైదరాబాద్లో మత్తు దందా గుట్టురట్టు..! ఇలా అతడు చేసిన ప్రయత్నం తన ప్రాణం మీదకు తెచ్చింది. పాముతో సెల్పీకి ప్రయత్నించి ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. పామును నోట్లో పెట్టుకుని అత్యుత్సాహం ప్రదర్శించడంతో అదికాస్తా కాటు వేసింది. దీంతో స్నేక్ క్యాచర్ శివ రాజు అక్కడికక్కడే మరణించాడు. శివరాజులు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. #nizamabad సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి