Nizamabad News: కూతురు వరసయ్యే అమ్మాయితో.. ఆ కౌన్సిలర్ ఏం చేశాడంటే? నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్ కూతురు వరసయ్యే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. లాడ్జిలో ఆ యువతితో ఉన్న సమయంలో అడ్డంగా బుక్కయ్యాడు. ఆ యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Nikhil 30 Aug 2024 in రాజకీయాలు నిజామాబాద్ New Update షేర్ చేయండి శారీరక సుఖం కోసం వయస్సు, వరసలకు కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు కొందరు. ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఇలాంటి ఘటనల్లో అడ్డంగా దొరికి పరువు పోగొట్టుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. బోధన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ గంగారం కూతురు వరసయ్యే ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆ అమ్మాయితో లాడ్జీకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ఆ లాడ్జికి రెడ్హ్యాండెడ్గా వారిని పట్టుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #nizamabad-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి