Dharani: ఎత్తేద్దామా, మారుద్దామా!.. ఎన్‌ఐసీకి ధరణి బాధ్యతలు?

పోర్టల్‌ నిర్వహణ బాధ్యతను కేంద్రం అధీనంలో ఉండే ఎన్ఐసీకి అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. మొదట రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని సీజీజీకి బాధ్యతలు అప్పగించేందుకు చర్చలు జరిగినప్పటికీ, విశ్వసనీయతలో రాజీ పడొద్దన్న ఉద్దేశంతో ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది.

New Update
Dharani: ఎత్తేద్దామా, మారుద్దామా!.. ఎన్‌ఐసీకి ధరణి బాధ్యతలు?

NIC To Take Dharani: ధరణిని మొత్తంగా ఎత్తేయాలా.. లేదంటే పేరు మార్చి సైట్‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేస్తే సరిపోతుందా అన్న విషయమై కూడా సర్కారు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే పోర్టల్‌ (Dharani Portal) నిర్వహణ బాధ్యతను కేంద్రం అధీనంలో ఉండే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. మొదట రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG)కు నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు చర్చలు జరిగినప్పటికీ, విశ్వసనీయతలో రాజీ పడొద్దన్న ఉద్దేశంతో ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ధరణిపై సమీక్షల్లో భాగంగా ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమైన ధరణి కమిటీ సోమవారం మరోసారి సమావేశమై కీలక విషయాలు చర్చించింది.

లక్షలాది మంది బాధితులు: కమిటీ సభ్యుడు కోదండరెడ్డి
ధరణి పోర్టల్ లోపాల వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Govt) హయాంలో అనేకమంది పేద రైతులకు రైతుబంధు (Rythu Bandhu) సాయం అందలేదని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు. సోమవారం సీసీఎల్ఏలో ధరణిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశమై పోర్టల్‌ లోపాలు, చేయాల్సిన సవరణలపై చర్చించింది. గతప్రభుత్వం చేసిన చట్టాల్లో లోపాలు లక్షలాది మంది రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని, వాటిని సవరించాల్సిన అవసరముందని అన్నారు కోదండరెడ్డి. కమిటీ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటుందని చెప్పారు. ధరణిపై హైకోర్టు లో చాలా కేసులు ఉన్నాయని న్యాయవాది సునీల్ చెప్పారు. ధరణితో సంబంధం ఉన్న అన్ని శాఖల అభిప్రాయం తీసుకుని; తాత్కాలిక, దీర్ఘకాలిక చర్యలను పరిశీలిస్తామని సీనియర్ అధికారి రేమండ్ పీటర్ అన్నారు. రెండు రోజుల్లో కొందరు కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: గెలిచే దాకా కొట్లాడుతా.. బ్లెస్‌ మీ సర్‌.. కోదండరాంతో బర్రెలక్క భేటీ

ప్రాధాన్య క్రమంలో నివేదికలు
ఒక్కో అంశంపైనా ప్రాధాన్య క్రమంలో కమిటీ నివేదికలు సమర్పించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అసైన్డ్, భూదాన్, వక్ఫ్, ఎండోమెంట్ భూములపై అనేక చిక్కుముళ్లు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంలో ఏడు దఫాలుగా జరిగిన అసైన్డ్ భూ పంపిణీకి సంబంధించి కూడా అనేక సమస్యలు తలెత్తాయి. ఇటీవలి వరకూ కమిటీ ఈ సమస్యలతో పాటు పలు అంశాలపై చర్చించింది.

లెక్కలేనన్ని సమస్యలు!
చాలా కాలం క్రితం కొని, సాగు చేసుకుంటున్న భూములు పోర్టల్‌లో గతంలో విక్రయించిన వారి పేర్లతో చూపడం; పట్టాభూములను ప్రభుత్వ, అసైన్డ్ భూములుగా చూపించడం వంటి సమస్యలు తలెత్తాయి. కొన్ని భూములు నిషేధిత జాబితాలో కూడా చేరాయి. విస్తీర్ణంలో తేడాలు, పేర్లలో తప్పులు, సర్వే నంబర్లలో తప్పుల వంటివి బయటపడ్డాయి. చాలా మందికి పాస్ బుక్కుల (Pass Books) సమస్య కూడా ఉంది. వీటన్నిటిపైనా లెక్క లేనన్ని పత్రాలు, పెండింగ్‌ సమస్యలు కూడా బాధితులు విన్నవించే అవకాశం ఉండడంతో పోర్టల్ సమూల మార్పులపై ప్రజాభిప్రాయ సేకరణ కష్టంగా మారవచ్చు. ఈ నేపథ్యంలో కార్యాచరణపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

వికేంద్రీకరణే మార్గం! 
భూ సమస్యల పరిష్కార మార్గాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రీకృతం చేసింది. తహశీల్దార్ పనిని కూడా సీసీఎల్ఏకి అప్పగించింది. ఈ నేపథ్యంలో భూమాత పోర్టల్‌ అమలు చేస్తే యంత్రాంగాన్ని వికేంద్రీకరించడం తప్పదని కమిటీ నిర్ణయానికి వచ్చింది. సమస్యల స్థాయిలను బట్టి కేటగిరీలుగా విభజించాలని నిర్ణయించారు.

ఎన్‌ఐసీనే ఎందుకు?
మాడ్యూళ్లను యాడ్ చేయడం, తొలగించడం వంటి పనులు ఎన్ఐసీతో సులభంగా జరుగుతాయని భావిస్తున్నారు. ఆ సంస్థ వద్ద ఆధార్ సమాచారం కూడా ఉండడం మరో అడ్వాంటేజ్‌. గోప్యత, నిష్పాక్షికతకు అవకాశం ఎక్కవ ఉంటుందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. గత ప్రభుత్వం ధరణి నిర్వహణను టెర్రాసిస్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. తాజాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థ మొత్తం ప్రభుత్వం అధీనంలోనే ఉండాలని భావిస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hafiz Saeed : మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

పాకిస్తాన్‌తో సింధు జల ఒప్పందాన్ని తక్షణమే భారత్ రద్దు చేసుకుంది. దీంతో పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
modi, Hafiz Saeed

modi, Hafiz Saeed

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత మోదీ సర్కార్ కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్‌తో సింధు జల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకుంది. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మీరు పాకిస్థాన్ కు నీళ్లు ఆపుతారా? కశ్మీర్లో డ్యామ్ కట్టి నీళ్లు ఆపితే మేము మీ శ్వాస ఆపుతాం. ఆ నదుల్లో మీ రక్తం ప్రవహిస్తుంది' అని హఫీజ్ గతంలో మాట్లాడిన వీడియోను పాక్ ISI వైరల్ చేస్తూ పాకిస్థానీలను రెచ్చగొడుతోంది. 

Also Read :  జాగ్రత్తగా చూసుకున్నాడు...మా బంధానికి పేరు పెట్టలేను...సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ప్రతీ నీటి బొట్టుపై హక్కు ఉంది

మరోవైపు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ తీవ్రంగా విమర్శించింది.  సింధు జలాల్లోని ప్రతీ నీటి బొట్టుపై తమకు హక్కు ఉందన్నారు పాకిస్తాన్ మంత్రి అవైస్ అహ్మద్ ఖాన్. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము న్యాయపరంగా, దౌత్యపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగడమంటే యుద్ధం ప్రకటించడమేనన్నారు. ప్రపంచ బ్యా్ంకు వంటి సంస్థలు కుదుర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలగలేదని ఆ దేశ మంత్రి అవాయిస్ లేఖరి ఎక్స్ వేదికగా ట్వీ్ట్ చేశారు. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిర్లక్ష్యంగా నిలిపివేయడం పిరికితనం, చట్టవిరుద్ధమైన చర్య అని పాకిస్తాన్ విద్యుత్ మంత్రి అవాయిస్ లేఖరి ఎక్స్ వేదికగా ట్వీ్ట్ చేశారు.   

Also Read :  భద్రతా బలగాలకు మావోయిస్టు అగ్రనేత లేఖ

సింధు జలాల ఒప్పందం 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరింది. సింధూ నది టిబెట్‎లో పుట్టి.. భారత్, పాక్ మీదుగా 3 వేల 180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మార్గమధ్యంలో ఈ నదిలోకి ప్రధానంగా ఆరు ఉపనదులు కూడా కలుస్తుంటాయి. దేశ విభజన అనంతరం సింధు జలాల నిర్వహణపై భారత్, పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం, ఇతర విషయాల్లో చాలా విషయాల్లో వివాదాలు వచ్చాయి. దీంతో 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ ఆయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై ఇరువురు  సంతకాలు చేశారు. 

Also Read :  పెళ్లికెళ్తే చచ్చేంతపనైంది.. తేనెటీగల దాడిలో స్పాట్‌లోనే 50 మంది!

Also Read :  విడదల రజనికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట!

telugu-news | Jammu and Kashmir | india | Lashkar Chief Hafiz Saeed

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు