AP: అమానవీయ ఘటన.. రూ.10 వేలకు బిడ్డను అమ్ముకున్న తల్లి.. కారణం ఇదే..!

నెల్లూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్త్రీ, శిశు సంరక్షకురాలిగా విధులు నిర్వర్తిస్తోన్న ఓ మహిళ 48 ఏళ్ల వయసులో గర్భం దాల్చి తనకు పుట్టిన బిడ్డను రూ.10 వేలకు అమ్ముకుంది. వివాహేతర సంబంధం కారణంగా పుట్టిన బిడ్డ కావడంతోనే ఆమె ఇలా చేసినట్లు తెలుస్తోంది.

New Update
AP: అమానవీయ ఘటన.. రూ.10 వేలకు బిడ్డను అమ్ముకున్న తల్లి.. కారణం ఇదే..!

Nellore: నెల్లూరు జిల్లాలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పొన్నలూరు మండలంలోని ఓ గ్రామంలో స్త్రీ, శిశు సంరక్షకురాలిగా విధులు నిర్వహిస్తోన్న ఓ మహిళ భర్త నుంచి విడిపోయింది. అనంతరం వేరే వ్యక్తితో సహ జీవనం చేసి 48 వయసులో గర్భం దాల్చింది. ఈ నెల 21న కందుకూరు వైద్యశాలలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

Also Read: సీఎం చంద్రబాబు సీరియస్‌.. కేబినెట్‌ భేటీలోనే వారిపై..

రక్తహీనత, నిమోనియాతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో తన పక్కనే బెడ్‌పై ఉన్న మరో మహిళ, ఆమె భర్తతో మాటలు కలిపింది. తనకు పుట్టిన బిడ్డను వేరే ఎవరికైనా విక్రయిస్తానని చెప్పింది. దీంతో వారు ఈ విషయమై తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన తమ బంధువులను సంప్రదించారు.

Also Read: సంగం డెయిరీ దగ్గర ఉద్రిక్తత.. రైతుల ఆందోళన..!

అక్కడి నుంచి వచ్చిన సమ్మతం మేరకు పొత్తిళ్లలోని శిశువును ఖమ్మంకు తీసుకెళ్లి అప్పగించారు. బంధువుల నుంచి రూ. 10 వేలు తీసుకుని శిశువు తల్లికి రూ. 6 వేలు ఇచ్చి మిగిలిన రూ. 4 వేలు వారు తీసుకొన్నారు. తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆసుపత్రి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఒంగోలు ఆసుపత్రి నుంచి బాలింత ఒకరు శిశువుతో సహా కనిపించకుండా వెళ్లిపోయారని ఈ నెల 24న బాలల సంరక్షణ కమిటీ దృష్టికి వచ్చింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింద.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది

New Update

AP Crime: విశాఖలో గర్భిణీ అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. పీఎం పాలెం పీఎస్‌ పరిధిలో గర్భిణీ అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలు ఆడిన్నారు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు.

గతంలో చంపడానికి ప్లాన్..

ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు స్నేహితులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్‌ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్‌ అందరికీ వీడియో కాల్‌ చేశాడు.
 
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే ఇవే లాభాలు

రాత్రికి రాత్రి అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే.. మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదు. వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.   

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

( AP Crime | ap-crime-news | ap-crime-report | ap crime updates | ap crime latest updates )

Advertisment
Advertisment
Advertisment