AP: విజయవాడలో దారుణం.. కవలలు మృతి..! విజయవాడలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవల పిల్లలు మృతి చెందారు. బండ్రపల్లి మాధవి అనే గర్భిణీ పురిటి నొప్పులతో పద్మావతి హాస్పిటల్లో చేరింది. అయితే, డాక్టర్ నిర్లక్ష్యం వహించడంతో కవలలు మృతి చెందారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. By Jyoshna Sappogula 03 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి AP: విజయవాడలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవల పిల్లలు మృతి చెందారు. బండ్రపల్లి మాధవి అనే గర్భిణి పురిటి నొప్పులతో పద్మావతి హాస్పిటల్ లో చేరింది. అయితే, డబ్బులు సరైన సమయానికి కట్టకోవపోడంతో డాక్టర్ ఆమెకు వైద్యం చేయడానికి నిరాకరించారు.మాధవి పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన ఫలితం లేకుండా పోయింది. సరైన సమయానికి వైద్యం చేయకపోవడంతో కవలలు ఇద్దరూ మృతి చెందారు. Also Read: పిఠాపురంలో మూడో రోజు పవన్ పర్యటన..షెడ్యూల్ ఇదే..! విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ విషయంపై స్పందించి కఠిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, మాధవి గతంలో వాలంటీర్ గా పనిచేసే రాజీనామా చేసింది. భర్త ప్రశాంత్ గంగూరు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. #vijayawada సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి