Breaking: కుప్పకూలిన నేవీ హెలికాఫ్టర్‌..అధికారి మృతి!

భారత నావికాదళానికి చెందిన చేతక్‌ హెలికాఫ్టర్‌ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఓ నేవీ అధికారి ప్రాణాలు కోల్పోయారు

New Update
Breaking: కుప్పకూలిన నేవీ హెలికాఫ్టర్‌..అధికారి మృతి!

భారత నావికాదళానికి చెందిన చేతక్‌ హెలికాఫ్టర్‌ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఓ నేవీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. శనివారం మధ్యాహ్నం కొచ్చి నేవీ హెడ్ క్వార్టర్స్ లోని ఐఎన్‌ఎస్‌ గరుడ రన్‌ వే పై ఈ ప్రమాదం జరిగింది. పైలట్‌ తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో చాపర్‌ రోటర్‌ బ్లేడ్లు తగిలి రన్‌ వే పై ఉన్న నౌకాదళ అధికారి మృతి చెందినట్లు సమాచారం. ఇద్దరు పైలట్లకు గాయాలైనట్లు తెలుస్తుంది. పైలట్లు ఇద్దరినీ నావికాదళ ప్రధాన కార్యాలయంలోని సంజీవని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కొచ్చి హార్బర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Also read: ఆ గ్రామ ప్రజలు 200 ఏళ్లుగా దీపావళిని జరుపుకోవడం లేదు..ఎందుకంటే!

updated soon...

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మియాపూర్‌లో దారుణం.. మద్యం మత్తులో భార్య, అత్తను ఏం చేశాడంటే?

హైదరాబాద్‌ మియాపూర్‌లో మద్యం మత్తులో మహేష్ భార్య, అత్తను దారుణంగా కత్తితో దాడి చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహేష్ భార్య, అత్తపై దాడి చేశాడు.

New Update
attack

Miyapur

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో భార్య, అత్తను దారుణంగా కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మియాపూర్‌లోని జనప్రియ నగర్‌లో ఉంటున్న మహేష్, శ్రీదేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మహేష్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే వీరి మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు వస్తున్నాయి. ఈ క్రమంలో మద్యంలో మత్తులో మహేష్ భార్య, అత్తపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం భార్య శ్రీదేవి ఆరోగ్యం నిలకడగా ఉందని, శ్రీదేవి తల్లి మెడపై తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల

కనికరం లేకుండా చంపేసి..

ఇదిలా ఉండగా.. మెదక్‌లో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య అత్యంత దారుణంగా హతమార్చింది. కూతురితో కలిసి కనికరంలేకుండా చంపేసి కాటికి పంపించారు. వొద్దని తండ్రి వేడుకుంటున్నా ఏ మాత్రం జాలిచూపకుండా అదిమిపట్టి గొంతు పిసికి చంపేశారు. ఆ తర్వాత ఆరోగ్యం బాగోలేదని నమ్మించే ప్రయత్నం చేశారు.

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

కానీ గ్రామస్థులు రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడగా అమానుషమైన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నామాపూర్‌ లో ఆదివారం ఈ ఘటన జరిగింది.  గొల్ల జోగయ్య (51) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

కొంతకాలంగా మద్యానికి బానిసైన జోగయ్య.. రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవపడేవాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అలాగే తాగిన జోగయ్య.. గట్టిగా మందలిస్తే భార్య, బిడ్డను కొట్టేవాడు. దీంతో విసుగు చెందిన భార్య నాగమ్మ తన ఇంట్లో చిన్న కూతురి సహాయంతో జోగయ్యను చంపేసింది. మద్యం మత్తులో ఉన్న జోగయ్య కూతురు అతని కాళ్లు పట్టుకోగా నాగమ్మ మెడకు చీర బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు