/rtv/media/media_files/2026/02/05/lottery-2026-02-05-21-36-09.jpg)
కర్ణాటక ప్రాంతానికి చెందిన ఒక సామాన్య ప్రవాస భారతీయుడిని అదృష్టం వరించింది. అబుదాబిలో నిర్వహించిన ప్రఖ్యాత బిగ్ టికెట్ రాఫిల్ డ్రాలో ఉడుపి జిల్లాకు చెందిన శంతను శెట్టిగార్ ఏకంగా 20 మిలియన్ దిర్హామ్లు (సుమారు రూ. 49 కోట్లు) గెలుచుకున్నారు. ఈ భారీ జాక్పాట్ వార్త తెలియడంతో ఆయన సొంతూరు ఉద్యావర్లో పండుగ వాతావరణం నెలకొంది.
மகள் பிறந்த நேரம்.. லாட்டரியில் 49 கோடி ரூபாய் கொட்டியது யோகம்! நண்பருக்கு பகிர்ந்து கொடுக்க முடிவு
— Oneindia Tamil (@thatsTamil) February 5, 2026
more details: https://t.co/OClKQbBcE4#Lottery#Offbeat#Oman#Karnata#OneIndia#TamilOneIndiapic.twitter.com/HvDFFp7xNt
ప్రస్తుతం ఓమన్ దేశంలోని మస్కట్లో రిటైల్ రంగంలో పనిచేస్తున్న 33 ఏళ్ల శంతను, తన స్నేహితుడితో కలిసి ఈ లాటరీ టికెట్ను కొనుగోలు చేశారు. మంగళవారం ఆన్లైన్లో వెల్లడించిన ఫలితాల్లో ఆయన కొన్న టికెట్ నంబర్ 305810 (సిరీస్ 283) గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకుంది. ఈ భారీ మొత్తాన్ని తన స్నేహితుడితో పంచుకోనున్నట్లు శంతను నిర్వాహకులకు తెలిపారు.
అనేక ఏళ్లుగా విదేశాల్లో కష్టపడుతున్న శంతనుకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడంపై ఉడుపిలోని ఆయన బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ ప్రాంతానికి గర్వకారణమని వారు సంబరాలు చేసుకుంటున్నారు. గల్ఫ్ దేశాల్లో భారతీయులు ఇలాంటి భారీ జాక్పాట్లు గెలవడం ఇదే మొదటిసారి కాదు, కానీ ఉడుపి యువకుడికి ఈ అదృష్టం దక్కడం విశేషం.
బిగ్ టికెట్ అంటే ఏమిటి?
అబుదాబిలో ప్రతి నెలా నిర్వహించే ఈ బిగ్ టికెట్ రాఫిల్ డ్రా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో నివసించే ప్రవాస భారతీయులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి దీనిని ఎంచుకుంటూ ఉంటారు.
Follow Us