పోలీసులకు రైల్వే షాక్.. టికెట్ లేకుంటే భారీ జరిమానా!

టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై చర్యలు తీసుకునేందుకు భారతీయ రైల్వే శాఖ సిద్ధమైంది. ముఖ్యంగా పోలీసులు టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లలో ప్రయాణిస్తున్నారని, ఇకపై టికెట్ లేని వారందరికీ జరిమానా విధించనున్నట్లు అధికారులు తెలిపారు.

author-image
By srinivas
New Update
drd

Railway: టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై చర్యలు తీసుకునేందుకు భారతీయ రైల్వే శాఖ సిద్ధమైంది. మరో రెండు వారాల్లో దసరా పండుగ సీజన్ మొదలుకానుండగా.. టికెట్ లేని, అనధికారిక ప్రయాణికులను కట్టడి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అక్టోబరు 1 నుంచి 15, అక్టోబరు 25 నుంచి నవంబరు 10 వరకు 17 జోన్ల జనరల్ మేనేజర్లకు ఇందుకు సంబంధించిన విధివిధానాలపై రైల్వేశాఖ లేఖలు పంపించింది. 

ఏసీ కోచ్ లలో వందలాది మంది పోలీసులు..

ఈ మేరకు తనిఖీల నివేదికలను నవంబరు 18 నాటికి పంపించాలని అధికారులకు సూచించింది. ముఖ్యంగా పోలీసులు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు రైల్వే కమర్షియల్ అధికారులు చెప్పారు. ఇటీవల గాజియాబాద్- కాన్పుర్ సెక్షన్లో తనిఖీలు చేపట్టగా.. వివిధ రైళ్లలోని ఏసీ కోచ్ లలో వందలాది మంది పోలీసులు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. అయితే వారందరికీ జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఆర్టీఐ వివరాల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.61 కోట్ల మంది టికెట్ లేకుండా పట్టుబడ్డారు. వారి నుంచి రూ.2,231 కోట్లు వసూల్ చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indian Railways: గుడ్‌న్యూస్‌.. ఇకనుంచి రైళ్లలో కూడా ATM సేవలు

ఇకనుంచి రైళ్లలో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు.త్వరలో మిగతా రైళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు.

New Update
India's first train ATM installed on board Panchavati Express

India's first train ATM installed on board Panchavati Express

రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి రైళ్లలో కూడా ఏటీఎం (ATM) సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రైవేట్‌ బ్యాంకుకు చెందిన ఎటీఎంను ఏసీ ఛైర్‌కార్‌ కోచ్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. 

Also Read: HCU భూముల వివాదంలో రేవంత్ సర్కార్‌కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు

త్వరలో పూర్తిస్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేశామని.. సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫిసర్‌ స్వప్నిల్‌ నీలా తెలిపారు. కోచ్‌లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా వినిగించిన స్థలంలోనే ఏటీఎం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రైలు ముందుకు వెళేటప్పుడు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా షట్టర్‌ డోర్‌ అమర్చినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కోచ్‌లో కూడా అవసరమైన మార్పులు మన్మాడ్‌ వర్క్‌షాప్‌లో చేశామని స్పష్టం చేశారు.

Also Read: రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!

 అయితే ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినల్ నుంచి మన్మాడ్‌ జంక్షన్ వరకు ప్రతిరోజూ పంచవటి ఎక్స్‌ప్రెస్‌ వెళ్తుంది. దాదాపు 4.30 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే ఈ రైలు ఆ మార్గంలో కీలకంగా ఉంది. అందుకే ముందుగా ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే మిగతా మార్గాల్లో కూడా రైళ్లలో ఏటీఎం సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

telugu-news | national-news | trains

Advertisment
Advertisment
Advertisment