Haryana: కాంగ్రెస్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు! హర్యానాలోని పంచుకులలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి కాన్వాయ్పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడి ఘటనలో ఎమ్మెల్యే అనుచరుడికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు పేర్కొన్నారు. By Bhavana 21 Sep 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి హర్యానాలోని పంచుకులలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి కాన్వాయ్పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడి ఘటనలో ఎమ్మెల్యే అనుచరుడికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు పేర్కొన్నారు. అనుచరుడికి రెండు చోట్ల బుల్లెట్ గాయాలు అయ్యాయి. సదరు అనుచరుడికి నేర కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కాల్పుల వెనుక ముఠా తగాదాలు ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. అక్టోబర్ నెలలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో కాల్పుల ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. కాల్పుల విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బుల్లెట్ గాయాలైన అనుచరుడిని చికిత్స నిమిత్తం చండీగఢ్లోని పీజీఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు. #haryana-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి