UP : స్కూల్ కోసం రెండవ తరగతి విద్యార్థిని బలి ఇచ్చిన యాజమాన్యం! యూపీలో పాఠశాల అభివృద్ది చెందాలని స్కూల్ హాస్టల్ లోనే ఏడు సంవత్సరాల బాలుడ్ని బలి ఇచ్చింది స్కూల్ యాజమాన్యం. వారం కిందట ఈ ఘటన జరగగా..తాజాగా వెలుగులోకి వచ్చింది. By Bhavana 28 Sep 2024 in నేషనల్ క్రైం New Update షేర్ చేయండి Uttar Pradesh : యూపీలో దారుణం జరిగింది. క్షుద్ర పూజల పేరిట హథ్రాస్ లో 2 వ తరగతి చదువుతున్న ఏడు సంవత్సరాల బాలుడిని బలి ఇచ్చింది స్కూల్ యాజమాన్యం. విద్యార్థి చదువుతున్న పాఠశాల అభివృద్ది చెందాలని స్కూల్ హాస్టల్ లోనే బాలుడిని చంపేశారు. వారం కిందట జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగు చూసింది. బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..పాఠశాల యజమాని జసోదన్ సింగ్ తో అతని కుమారుడు దినేష్ భఘేల్ పాటు మరో ముగ్గురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుఉన్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా వెలువడిని పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..7 ఏళ్ల కృతార్థ్ హథ్రాస్ జిల్లాలోని రస్గవాన్లోని డీఎల్ పబ్లిక్ స్కూల్ లో రెండో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గతవారం తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని సోమవారం ఆయనకు స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో తండ్రి స్కూల్ వద్దకు వెళ్లగా..బాలుడిని పాఠశాల డైరెక్టర్ (School Director) తండ్రి కారులో ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడని వార్డెన్ చెప్పాడు. దీంతో హాస్టల్ దగ్గరే వేచి ఉన్న కృష్ణన్ కు మీ కొడుకు చనిపోయాడని దినేష్ బాఘెల్ చెప్పాడు. తన కారులోని బాలుడి మృతదేహాన్ని తండ్రికి అప్పగించాడు. అయితే కొడుకు మరణం పై అనుమానంతో కృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్కూల్ డైరెక్టర్ తండ్రి దినేశ్ బాఘేల్ కు క్షుద్రపూజల మీద నమ్మకం ఉందని పోలీసులు తెలిపారు. బాలుడ్ని ముందు స్కూల్ బయట ఉన్న గొట్టపు బావి దగ్గర చంపాలని భావించారు. కానీ బయటకు తీసుకుని వెళ్తున్న సమయంలో బాలుడు గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. దీంతో బాలుడ్ని అక్కడే గొంతు నులిమి చంపేశారు. స్కూల్ కి దగ్గర్లోనే కొన్ని క్షుద్రపూజ సామానులు గుర్తించినట్లు పోలీసులు గుర్తించారు. Also Read: తగ్గిన బంగారం ధరలు..తులం ఎంత ఉందంటే! సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి