AP: టీడీపీలోకి నరసాపురం ఎంపీ.. పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం..! రేపు పాలకొల్లులో టీడీపీ ప్రజాగళం సమావేశం నిర్వహించనుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆధ్వర్యంలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నార్ధకంగా మారిన రఘురామ కృష్ణంరాజు పోటీ వ్యవహారంపై రేపు పాలకొల్లు సభలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. By Jyoshna Sappogula 04 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి MP Raghu Ramakrishna raju: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు పాలకొల్లులో ప్రజాగళం సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో నరసాపురం ఎన్డీయే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తామంటూ రఘురామ కృష్ణంరాజు వెల్లడించిన సంగతి తెలిసిందే. Also Read: నా పై హత్యాయత్నం జరిగింది.. ఎమ్మెల్యే అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు..! అయితే చివరి నిమిషంలో నరసాపురం ఎంపీ టికెట్ బీజేపీ సీనియర్ నేత భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేటాయించారు. శ్రీనివాసవర్మకు ఎంపీ టికెట్ కేటాయించినా తానే నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానంటూ రఘురామ కృష్ణంరాజు తన కార్యకర్తలకు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఉండి ఎమ్మెల్యే గా రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తారంటూ రెండు రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. Also Read: మళ్లీ దొరికిపోయిన విజయ్-రష్మిక.. ఇదిగో ప్రూఫ్! కానీ, ఇప్పటికే ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించారు. ఇలా ప్రస్తుతం రఘురామ కృష్ణంరాజు పోటీ వ్యవహారం ప్రశ్నార్ధకంగా మారింది. రేపు పాలకొల్లు సభలో రఘురామ పోటీపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి రఘురామ కృష్ణంరాజు తన అనుచరులతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. #mp-raghu-ramakrishna-raju సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి