lokesh: పాదయాత్రలో చంద్రబాబు రికార్డును బ్రేక్ చేసిన లోకేష్

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజల్లో తిరుగుతున్నారు. పాదయాత్రలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే పనితీరును ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.

New Update
lokesh: పాదయాత్రలో చంద్రబాబు రికార్డును బ్రేక్ చేసిన లోకేష్

lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజల్లో తిరుగుతున్నారు. పాదయాత్రలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే పనితీరును ఎండగడుతున్నారు. ఈ ఏడాది జవనరిలో మొదలుపెట్టిన పాదయాత్ర ఇప్పటికే 200రోజులు పూర్తిచేసుకోవడంతో పాటు 2800 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే లోకేష్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. తన తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబు రికార్డును ఆయన అధిగమించారు. 2012లో మీకోసం పేరుతో చంద్రబాబు 208 రోజుల్లో 2,817 కిలోమీటర్ల దూరం పాదయాత్రను పూర్తి చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు లోకేష్ 206 రోజుల్లోనే 2,817 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేశారు. దీంతో తండ్రి రికార్డును కొడుకు తిరగరాయడంతో టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

3,648 కి.మీల పాదయాత్రలో జగన్ రికార్డు..

ఇక 2018లో అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ చేసిన పాదయాత్ర తెలుగు రాష్ట్రాల్లో రికార్డుగా ఉంది. 13 జిల్లాల్లో 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వైసీపీ భారీ మెజార్టీలో అధికారంలోకి రావడానికి జగన్ చేసిన పాదయాత్రే కారణంగా చెబుతారు విశ్లేషకులు. ఇప్పుడు ఈ రికార్డును కూడా అధిగమించేందుకు లోకేష్ రెడీ అయ్యారు. 400 రోజులు 4వేల కిలోమీటర్లుగా పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటికే 3వేల కిలోమీటర్లకు దగ్గర్లో ఉన్న లోకేష్.. త్వరతో మరో 700 కిలోమీటర్లు నడిచి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అడుగుడుగునా ఆటంకాలు కలిగిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో లోకేష్.. సీఎం జగన్ పాదయాత్ర రికార్డును అధిగమిస్తారో లేదో వేచి చూడాలి.

నోటీసులు ఇవ్వడంపై లోకేష్ ఆగ్రహం..

ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేష్‌.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక, మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. భీమవరంలో క్యాంప్‌సైట్‌ వద్ద ఉన్న లోకేష్‌కు ప్రభుత్వం పెద్దలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు తీరుపై లోకేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర 200 రోజులకు చేరుకుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం శివారు దండమూడి కళ్యాణ మండపం నుంచి 200వ రోజు యువగళం పాదయాత్రను యువనేత లోకేష్ ప్రారంభించారు. యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావంగా నారా భువనేశ్వరి, నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గొన్నారు. ,

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Alekhya Chitti Pickles Issue: చావుబతుకుల్లో అలేఖ్య చిట్టి.. చిన్న పిల్లయ్యా- ఎమోషనల్ వీడియో

అలేఖ్య చిట్టి హాస్పిటల్‌లో చేరింది. బ్రీతింగ్ ఇష్యూతో ICU వార్డులో కొట్టిమిట్టాడుతుంది. తన చెల్లికి సీరియస్‌గా ఉందని సుమీ ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. తన చెల్లికి ఆక్సిజన్ తీసుకోవడం కూడా కష్టంగా ఉందంటూ తెలిపింది. దయచేసి ట్రోలింగ్ ఆపండంటూ వేడుకుంది.

New Update

గత వారం రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదమే నడుస్తోంది. ఆమె తిట్టిన బూతులు, ఆమె చేసిన బాగోతమే వైరల్ అవుతోంది. మీ పచ్చళ్లు రేటు ఎక్కువగా ఉన్నాయి అన్నందుకు అలేఖ్య చిట్టి బూతులతో రెచ్చిపోయింది. 

Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు.. రేటు ఎక్కువ అంటున్నావు అంటే మీ దరిద్రం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముందు కెరియర్ పై ఫోకస్ పెట్టు.. అంటూ నోటికొచ్చిన బూతులతో రెచ్చిపోయింది. అది కాస్త వైరల్‌ కావడంతో మీమ్స్, ట్రోలింగ్స్ మొదలయ్యాయి. దీంతో అలేఖ్యతో పాటు తన అక్కా, చెల్లిని కూడా బయటకులాగారు. 

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

వీరి ముగ్గురిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. వారికి కౌంటర్ ఇస్తూ విమర్శలు చేస్తున్నారు. తాము చేసింది తప్పేనని.. ఇకపై అలా చేయమని.. ఎవరినైతే తిట్టామో వారికి క్షమాపణలు చెబుతున్నామంటూ ముగ్గురు అక్కా చెల్లెల్లు వీడియోలు రిలీజ్ చేశారు. అయినా వారిపై ట్రోలింగ్స్ ఆగలేదు. ఇక ఈ విమర్శలకు గురైన అలేఖ్య చిట్టి తీవ్ర మనస్థాపంతో అనారోగ్యబారిన పడింది. 

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

ICUలో అలేఖ్య చిట్టి

అలేఖ్య చిట్టి ప్రస్తుతం హాస్పిటల్‌‌లో ఉంది. ఆమెను ICU వార్డ్‌లో ఉంచారు. అందుకు సంబంధించిన వీడియోను అలేఖ్య అక్క సుమీ (సుమ) సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలేఖ్య చిట్టికి సీరియస్‌‌గా ఉందని.. ఆమె హాస్పిటల్లో ICU బెడ్‌పై ఉందని తెలిపింది. బ్రీతింగ్ ఇష్యూ వల్ల హాస్పిటల్లో చేరినట్లు పేర్కొంది. తన చెల్లికి ఆక్సిజన్ తీసుకోవడం కూడా చాలా- కష్టంగా ఉందంటూ ఎమోషనల్ వీడియోను సుమీ రిలీజ్ చేసింది. 

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

అలేఖ్య చెల్లి ఆరోగ్యం అస్సలు బాలేదని తెలిపింది. సారీ చెప్పినా ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన చెందింది. దయచేసి ట్రోలింగ్ ఆపండి అంటూ నెటిజన్లను వేడుకుంది. మా నాన్న చనిపోయి 3 నెలలు కూడా కాలేదని.. ఇంకో చావు మా ఇంట్లో జరుగుతుందని భయం వేస్తోందని సుమీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ గా మారింది. 

(alekhyaa chitti pickle | alekhya chitti pickles audio | alekhya chitti pickles controversy | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment